Tuesday, 9 December 2025
  • Home  
  • జగ్గయ్యపేటలో ఆర్కా సోలార్ పవర్ రూఫ్‌టాప్ ప్లాంట్ ప్రారంభం
- ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో ఆర్కా సోలార్ పవర్ రూఫ్‌టాప్ ప్లాంట్ ప్రారంభం

జగ్గయ్యపేట ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా పట్టణానికి చెందిన గోపు కిరణ్ కుమార్ ఏర్పాటు చేసిన ఆర్కా సోలార్ పవర్ రూఫ్‌టాప్ ప్లాంట్ను జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా ప్రారంభిం చారు. ఈ ప్లాంట్ సత్యనారాయ ణపురం సాయిబాబా గుడి ఎదురుగా ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సౌరశక్తి ఎప్పటికీ తరగని సహజ వనరు. ఇది శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి పర్యావర ణాన్ని కాపాడుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి సమయంలో హానికర వాయువులు ఉత్పత్తి కాకపోవడం వలన వాతావరణ మార్పులను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది,” అని అన్నారు. అలాగే, ప్రజలు తమ ఇళ్లపై లేదా వ్యాపార సంస్థలపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవ డమే కాకుండా, నెట్ మీటరింగ్ ద్వారా అదనపు విద్యుత్తును విక్రయించి ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత్ పునరుత్పాదక శక్తి రంగంలో ప్రపంచంలో అగ్రస్థానం లో నిలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌరశక్తి వినియోగంలో ఆదర్శం గా నిలుస్తోంది,” అని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాం సాయి ప్రసాద్, శ్రీరాం చిన్నబాబు, నూకల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా పట్టణానికి చెందిన గోపు కిరణ్ కుమార్ ఏర్పాటు చేసిన ఆర్కా సోలార్ పవర్ రూఫ్‌టాప్ ప్లాంట్ను జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా ప్రారంభిం చారు. ఈ ప్లాంట్ సత్యనారాయ ణపురం సాయిబాబా గుడి ఎదురుగా ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సౌరశక్తి ఎప్పటికీ తరగని సహజ వనరు. ఇది శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి పర్యావర ణాన్ని కాపాడుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి సమయంలో హానికర వాయువులు ఉత్పత్తి కాకపోవడం వలన వాతావరణ మార్పులను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది,” అని అన్నారు. అలాగే, ప్రజలు తమ ఇళ్లపై లేదా వ్యాపార సంస్థలపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవ డమే కాకుండా, నెట్ మీటరింగ్ ద్వారా అదనపు విద్యుత్తును విక్రయించి ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత్ పునరుత్పాదక శక్తి రంగంలో ప్రపంచంలో అగ్రస్థానం లో నిలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌరశక్తి వినియోగంలో ఆదర్శం గా నిలుస్తోంది,” అని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీరాం సాయి ప్రసాద్, శ్రీరాం చిన్నబాబు, నూకల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.