రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గంలో వేసవి తీవ్రత దృష్ట్యా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన చోట ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.ప్రతి చలివేంద్రలో పరిశుభ్రమైన తాగునీరుతో పాటు మజ్జిగ కూడా అందుబాటులో ఉంచుతున్నాం.ఉదయం నుండి సాయంత్రం వరకు చలివేంద్రాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు, వృద్ధులకు, మహిళలకు మజ్జిగ అందజేస్తున్నాం.కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, డిస్పోజబుల్ గ్లాసులను ఉపయోగిస్తూ, ప్రజలకు సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సూక్ష్మమైన, చిన్నపాటి పనులను కూడా ప్రజల అవసరాన్ని బట్టి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాం.ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా అని తెలిపారు
చలివేంద్రాలను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు.
రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గంలో వేసవి తీవ్రత దృష్ట్యా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన చోట ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.ప్రతి చలివేంద్రలో పరిశుభ్రమైన తాగునీరుతో పాటు మజ్జిగ కూడా అందుబాటులో ఉంచుతున్నాం.ఉదయం నుండి సాయంత్రం వరకు చలివేంద్రాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు, వృద్ధులకు, మహిళలకు మజ్జిగ అందజేస్తున్నాం.కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, డిస్పోజబుల్ గ్లాసులను ఉపయోగిస్తూ, ప్రజలకు సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సూక్ష్మమైన, చిన్నపాటి పనులను కూడా ప్రజల అవసరాన్ని బట్టి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాం.ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా అని తెలిపారు

