ఆలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో, శ్రీ కర్రెమ్మ దేవాలయం, దుర్గమ్మ మండపం దగ్గర, విజయదశమి ఉత్సవ సందర్బంగా శ్రీ కట్టా ప్రభాకర్ జీ ( విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ ) ముఖ్య అతిథిగా హాజరై ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ…. పరమపూజనీయ డా॥ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925లో విజయదశమి పర్వదినాన స్థాపించారు. సమరసతతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైన సంఘం, ఈ విజయ దశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. యువత ప్రతి ఒక్కరూ స్ఫూర్తి దాయకంగా పయనించాలని సూచించారు. ఈ శుభతరుణంలో ఏర్పాటు చేసిన విజయదశమి ఉత్సవానికి బాయికాటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హనుమాన్ చాలీసా భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు.
ఆలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో, శ్రీ కర్రెమ్మ దేవాలయం, దుర్గమ్మ మండపం దగ్గర, విజయదశమి ఉత్సవ సందర్బంగా శ్రీ కట్టా ప్రభాకర్ జీ ( విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ ) ముఖ్య అతిథిగా హాజరై ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ…. పరమపూజనీయ డా॥ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925లో విజయదశమి పర్వదినాన స్థాపించారు. సమరసతతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైన సంఘం, ఈ విజయ దశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. యువత ప్రతి ఒక్కరూ స్ఫూర్తి దాయకంగా పయనించాలని సూచించారు. ఈ శుభతరుణంలో ఏర్పాటు చేసిన విజయదశమి ఉత్సవానికి బాయికాటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హనుమాన్ చాలీసా భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

