శ్రీకాళహస్తి రూరల్, డిసెంబర్ 09 : తొండమనాడులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఎగువవీధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించగ కార్యక్రమాన్ని రీజినల్ మేనేజర్ పి.ప్రకాశ్ రత్న బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా రీజినల్ మేనేజర్ ప్రకాష్ రత్నబాబు మాట్లాడు… ఈ అవకాశాన్ని గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు, గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అగర్వాల్ కంటి వైద్య హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 80 మంది ఖాతాదారులకు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి, అవసరమైన చికిత్సపై సూచనలు ఇచ్చారు. పలు కంటి సమస్యలను గుర్తించి ఖాతాదారులకు తగిన జాగ్రత్తలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎస్.బాల నరసింహం మరియు సిబ్బంది కలిసి శిబిరాన్ని విజయవంతం గా నిర్వహించారు.

గ్రామీణ బ్యాంక్ ఎగువవీధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
శ్రీకాళహస్తి రూరల్, డిసెంబర్ 09 : తొండమనాడులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఎగువవీధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించగ కార్యక్రమాన్ని రీజినల్ మేనేజర్ పి.ప్రకాశ్ రత్న బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా రీజినల్ మేనేజర్ ప్రకాష్ రత్నబాబు మాట్లాడు… ఈ అవకాశాన్ని గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు, గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అగర్వాల్ కంటి వైద్య హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 80 మంది ఖాతాదారులకు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి, అవసరమైన చికిత్సపై సూచనలు ఇచ్చారు. పలు కంటి సమస్యలను గుర్తించి ఖాతాదారులకు తగిన జాగ్రత్తలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎస్.బాల నరసింహం మరియు సిబ్బంది కలిసి శిబిరాన్ని విజయవంతం గా నిర్వహించారు.

