ఖమ్మం, అక్టోబర్
(పున్నమి ప్రతినిధి):
మొందా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లా మీద గట్టిగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారు జామున నుంచే మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు.
హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం, రానున్న 72 గంటలపాటు ఖమ్మం సహా తెలంగాణ దక్షిణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల బయటకు రావొద్దని, తక్కువ ప్రదేశాల్లో నీరు నిలిచే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


