భీమవరం ; .
భీమవరం మెంటేవారి తోటలో గ్రంధి శ్యామ్ శివరాజ్ అధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, మణికంఠ మందారం గురుస్వాములు బంగారమంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తామని, భక్తిశ్రద్ద లతో అయ్యప్ప స్వాముల పడిపూజ నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తీర్థ ప్రసాదాలు, నైవేధ్యాలు సమర్పించారు. అభిషేకాలు, మంగళ హారతులు, పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, మెంటే మనోజ్, తోట సురేష్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కూటమి నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం ; . భీమవరం మెంటేవారి తోటలో గ్రంధి శ్యామ్ శివరాజ్ అధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, మణికంఠ మందారం గురుస్వాములు బంగారమంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తామని, భక్తిశ్రద్ద లతో అయ్యప్ప స్వాముల పడిపూజ నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తీర్థ ప్రసాదాలు, నైవేధ్యాలు సమర్పించారు. అభిషేకాలు, మంగళ హారతులు, పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, మెంటే మనోజ్, తోట సురేష్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కూటమి నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

