(పున్నమి ప్రతినిధి)
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చలు జరగడం చూస్తున్నాం. కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని విమర్శిస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వడం ద్వారా ఆయనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆయన హాస్య నటుడిగా చేసిన కృషిని గుర్తించి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నారు. సరదాగా మాట్లాడిన మాటలను అర్ధం తప్పుగా తీసుకోవడం మంచిది కాదని కూడా కొందరు తెలుగు ప్రేక్షకులు పేర్కొంటున్నారు.


