Sunday, 15 March 2026
  • Home  
  • మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
- తిరుపతి

మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు ఎస్సీ కాలనీలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన విద్యా సామగ్రిని ఆదివారం నాడు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పైపూరి రంగయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ….ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు విజయవంతంగా రాయడానికి అవసరమైన సామగ్రిని అందజేస్తున్నామని. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా, మంచి ఫలితాలతో రాయాలని ఆకాంక్షిస్తూ పరీక్షా సామగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీ. నరేంద్ర, పి. అరుణాచలం, వినోద్, సంజీవ ప్రసాద్, చెంచు కృష్ణ, ఢిల్లీ బాబు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు ఎస్సీ కాలనీలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన విద్యా సామగ్రిని ఆదివారం నాడు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పైపూరి రంగయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ….ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు విజయవంతంగా రాయడానికి అవసరమైన సామగ్రిని అందజేస్తున్నామని. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా, మంచి ఫలితాలతో రాయాలని ఆకాంక్షిస్తూ పరీక్షా సామగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీ. నరేంద్ర, పి. అరుణాచలం, వినోద్, సంజీవ ప్రసాద్, చెంచు కృష్ణ, ఢిల్లీ బాబు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.