ఢిల్లీ షహీన్ బాగ్
( పున్నమి ప్రతినిధి గూడూరు)
రగిలించిన స్ఫూర్తి భారతదేశమంతటా విస్తరిస్తోంది. మతోన్మాదుల ఆశయాలను అడియాశలు చేస్తూ దేశమంతటా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ నిరసనలను దీక్షల రూపంలో తెలియజేస్తున్నారు. పాలకుల మనసులు మారాలని తద్వారా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి సమైక్యతను కాపాడుకోవాలని దీనికి రాజ్యాంగ రక్షణే శిరోధార్యమని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా గూడూరు పట్టణంలో గత 27 రోజులుగా స్థానిక పెద్ద మసీదునందు కులమతాలకతీతంగా ప్రజలు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నేడు గూడూరు మహిళలు కూడా దీక్షలో పాల్గొనడం ఈ ఉద్యమానికి మరింత వూతం లభించినట్లయింది. గూడూరు పట్టణ చరిత్రలో అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు తిరిగి అదే మసీదు నందు తమ దీక్షను ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ షంషేర్ మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను తెచ్చింది కనుక ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈమె కోరారు. దేశంలోని ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఈమె వాపోయారు. NPR చట్టాలకు వ్యతిరేకంగా వైయస్ జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడం మంచి పరిణామమని షంషేర్ చెప్పారు. స్వాతంత్రం కోసం ఎందరో ముస్లిములు ప్రాణత్యాగం చేశారు అలాంటి ముస్లింలను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, అలాగే నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని బిజెపి నాయకులను హెచ్చరించారు.
