*టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి వినతి పత్రం అందచేసిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు .*
ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 % శాతం రిజర్వేషన్ అమలు చేసి దానికి అనుగుణంగా సీట్లను కేటాయించాలని ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ సంపత్ కుమార్ గారు వినతి పత్రం అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ గారితో పాటు విద్యాశాఖ కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కొండేటి మల్లయ్య, మామిడి గోపి, తదితరులు పాల్గొన్నారు.


