విజయవాడ…. లబ్బీపేట న్యూస్ (డాక్టర్ మంజుల గుదిమెళ్ళ..పున్నమి )
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 16- 12-2025 వ తేదీన ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.
ధ్యానం అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి చేసే మానసిక ,శారీరక సాధన, వ్యక్తిగత ఎదుగుదలకు మెదడు పనితీరు మెరుగు పడుతుందని ధ్యానం ద్వారా మన ఆలోచనలు భావాలను అర్థం చేసుకొని మేధస్సును పెంచుతుందని తెలియజేశారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు జి. పద్మజ ఎన్. మాధవి, బి.వి దుర్గాభవాని విద్యార్థినులతో కొన్ని ఆసనాలు చేయించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. వి.వి.ఎస్. కుమార్ గారు ,ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్. కె.సరళ శ్రీమతి .టీ. నాగరాణి పి. శ్రీ భారతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


