రైల్వే కోడూరు నియోజకవర్గం:–
*రైల్వే కోడూరు పట్టణ సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన – అభివృద్ధి చర్యలకు హామీ ఇచ్చిన ఇంచార్జ్; kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి
*వర్షాలకు అస్సలు రోడ్లు లేక అవస్థలు పడుతున్న ప్రాంతాలను స్వయంగా వెళ్లి పరిశీలించిన ముక్కా రూపానంద రెడ్డి త్వరలో పరిష్కారం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.* .
*గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక, రోడ్డు వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను ముక్కా రూపానంద రెడ్డి వెంటనే పరిష్కారం అందిస్తామన్న హామీ ఇచ్చారు.*
*రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టిసారించిన టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈ రోజు కోడూరు పట్టణ పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.*
వారు రోడ్డు వసతి, భూగర్భ డ్రైనేజ్, మంచినీటి సమస్యలు వంటి అంశాలపై స్థానికులు చేసిన విన్నపాలను పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను గమనించిన నేత , అనంతరం ఆ ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి తగిన అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు.
*ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ –* “ప్రతి సమస్యపై సత్వర స్పందన ఇవ్వడమే మా బాధ్యత. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి కుటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని ” తెలిపారు.
ఈ పర్యటనలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలొచ్చేలా స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేశారు.



1 Comment
Dhanunjay
July 21, 2025good post