ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అగ్రికల్చర్ రైతులకు అవసరమైన యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మరియు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మాట్లాడుతూ, రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి ఒక బస్తా చొప్పున మొత్తం మూడు విడతల్లో యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి దోహదపడతాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


