ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామంలో సోమవారం తాసిల్దార్ రమాదేవి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గ్రామ సభను నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీఆర్వో నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామానికి 362 పాసుపుస్తకాలు రాగా, వాటిలో 55 పాసుపుస్తకాల్లో తప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 308 పాసుపుస్తకాలు మాత్రమే పంపిణీ చేశామని, మిగిలిన వాటిలో తప్పులు సరిచేసి త్వరలో అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పోతా రెడ్డి నందగోపాల్ రెడ్డి, ఎంట్రపల్లి మహేంద్ర, పిడూరు మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ గ్రామ సభలో పాసుపుస్తకాల పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామంలో సోమవారం తాసిల్దార్ రమాదేవి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గ్రామ సభను నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీఆర్వో నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామానికి 362 పాసుపుస్తకాలు రాగా, వాటిలో 55 పాసుపుస్తకాల్లో తప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 308 పాసుపుస్తకాలు మాత్రమే పంపిణీ చేశామని, మిగిలిన వాటిలో తప్పులు సరిచేసి త్వరలో అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పోతా రెడ్డి నందగోపాల్ రెడ్డి, ఎంట్రపల్లి మహేంద్ర, పిడూరు మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

