Monday, 8 December 2025
  • Home  
  • రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాని కూటమి ప్రభుత్వం ….మాజీ ఎంపీ చింతామోహన్
- తిరుపతి

రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాని కూటమి ప్రభుత్వం ….మాజీ ఎంపీ చింతామోహన్

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం నాడు పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారని ఎద్దేవా చేశారు…… శ్రీకాళహస్తి దేవస్థానం అవినీతి మయంగా మారిందని, సెల్ఫోన్ కౌంటర్ నందు, చెప్పుల కౌంటర్ నందు, కార్ పార్కింగ్ లలో భక్తులను నిలువు దోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం ప్రజా ప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా కాంట్రాక్ట్ దారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనాన్ని ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడ న్యాయం జరగడంలేదని, తుఫాన్ ప్రభావంతో భారీగా పడిన వర్షలతో రైతులు వారి పంటలు ముంపుకు గురై వారు అప్పుల పాలపై, ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇకకైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రైతులకు ఎంత సబ్సిడీ ఇచ్చాయో తెలియజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమలు తీసుకువస్తానని దేశవిదేశాలు తిరుగుతున్నాడు. కానీ ఇప్పటివరకు ఏ వక్క పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తీసుకున్న రాలేదని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకుని వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. అదేవిధంగా రైతులని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ బత్తెయ్య నాయుడు, నరేంద్ర నాయుడు, కూలి రవి, సమీవుల్లా, జనార్దన్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం నాడు పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారని ఎద్దేవా చేశారు…… శ్రీకాళహస్తి దేవస్థానం అవినీతి మయంగా మారిందని, సెల్ఫోన్ కౌంటర్ నందు, చెప్పుల కౌంటర్ నందు, కార్ పార్కింగ్ లలో భక్తులను నిలువు దోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం ప్రజా ప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా కాంట్రాక్ట్ దారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనాన్ని ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడ న్యాయం జరగడంలేదని, తుఫాన్ ప్రభావంతో భారీగా పడిన వర్షలతో రైతులు వారి పంటలు ముంపుకు గురై వారు అప్పుల పాలపై, ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇకకైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రైతులకు ఎంత సబ్సిడీ ఇచ్చాయో తెలియజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమలు తీసుకువస్తానని దేశవిదేశాలు తిరుగుతున్నాడు. కానీ ఇప్పటివరకు ఏ వక్క పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తీసుకున్న రాలేదని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకుని వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. అదేవిధంగా రైతులని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ బత్తెయ్య నాయుడు, నరేంద్ర నాయుడు, కూలి రవి, సమీవుల్లా, జనార్దన్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.