నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 – 12 (అక్టోబర్ 4-12) వరకు “మానసిక ఆరోగ్యం శ్రేయస్సు “పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలిని ఆమె ప్రారంభించారు.


