తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టంబేడు మండలంలలోని బసవయ్యపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాలలో శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 19మంది పేషెంట్లు చూపించుకోవడంతో వీరిలో 10మంది కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించి వారందరికీ శ్రీ భక్తకన్నప్ప కంటి ఆసుపత్రిలో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేస్తామని త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ వారు తెలిపినారు. వైద్య శిభిరంలో పాల్గొన్నా వారందరికీ ఉచితంగా పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది దామోదర్,స్వాతి, గ్రామస్తులు వాణి, రానెమ్మ, కనకమ్మలు ముందుండి ఐ క్యాంపుని విజయవంతం చేశారు.

బసవయ్యపాలెంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం
తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టంబేడు మండలంలలోని బసవయ్యపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాలలో శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 19మంది పేషెంట్లు చూపించుకోవడంతో వీరిలో 10మంది కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించి వారందరికీ శ్రీ భక్తకన్నప్ప కంటి ఆసుపత్రిలో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేస్తామని త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ వారు తెలిపినారు. వైద్య శిభిరంలో పాల్గొన్నా వారందరికీ ఉచితంగా పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది దామోదర్,స్వాతి, గ్రామస్తులు వాణి, రానెమ్మ, కనకమ్మలు ముందుండి ఐ క్యాంపుని విజయవంతం చేశారు.

