Wednesday, 11 March 2026
  • Home  
  • పరీక్షల్లో సాధించే ఉత్తమ ఫలితాలే ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.. కలవగుంట భరత్
- తిరుపతి

పరీక్షల్లో సాధించే ఉత్తమ ఫలితాలే ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.. కలవగుంట భరత్

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 11: పదవ తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రముఖ సంఘ సేవకులు కలవగుంట భరత్ రెడ్డి ఆకాంక్షించారు. తొట్టంబేడు మండలం చిట్టత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. రగ్బీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్న పదో తరగతి చదువుతున్ దయాసాగర్ అనే విద్యార్థిని ప్రోత్సహిస్తూ తనవంతు ఆర్థిక సాయం చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలవగుంట భరత్ రెడ్డి మాట్లాడుతూ.. పదవ తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని, ఈ పరీక్షల్లో సాధించే ఫలితాలే ఉన్నత శిఖరాలకు దారి చూపుతాయని పేర్కొన్నారు. “ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయం” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు. రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన దయాసాగర్ వంటి క్రీడాకారులను ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు సుబ్రహ్మణ్యం, తెలుగు ఉపాధ్యాయురాలు లోకనాయకి, బేబీ త్రిషికా రెడ్డి,గురునాథం, వాసు, నాగరాజు, దానా, వెంకటేష్, మోతీష్, శ్యామ్, గోపి, రవి, రాము, లోకేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 11: పదవ తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రముఖ సంఘ సేవకులు కలవగుంట భరత్ రెడ్డి ఆకాంక్షించారు. తొట్టంబేడు మండలం చిట్టత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. రగ్బీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్న పదో తరగతి చదువుతున్ దయాసాగర్ అనే విద్యార్థిని ప్రోత్సహిస్తూ తనవంతు ఆర్థిక సాయం చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలవగుంట భరత్ రెడ్డి మాట్లాడుతూ.. పదవ తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని, ఈ పరీక్షల్లో సాధించే ఫలితాలే ఉన్నత శిఖరాలకు దారి చూపుతాయని పేర్కొన్నారు. “ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయం” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు. రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన దయాసాగర్ వంటి క్రీడాకారులను ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు సుబ్రహ్మణ్యం, తెలుగు ఉపాధ్యాయురాలు లోకనాయకి, బేబీ త్రిషికా రెడ్డి,గురునాథం, వాసు, నాగరాజు, దానా, వెంకటేష్, మోతీష్, శ్యామ్, గోపి, రవి, రాము, లోకేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.