శ్రీకాళహస్తి పట్టణంలోని గోపాలవనం నందు గల కోర్టు సముదాయాల వెనకవైపు గల గోడ కూలి అక్కడ నివసిస్తున్నటువంటి వారి గృహాలు ధ్వంసం కావడంతో నిర్వాసితులను పరామర్శించి,వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని తపాలా దామోదర రెడ్డి తెలిపారు.అనంతరం చరవాణి ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మార్వో కి పరిస్థితిని వివరించగా వారు స్పందిస్తూ వెంటనే సహాయక చర్యలు చేపడతామని తెలిపారని అదేవిధంగా కూలిపోయినటువంటి గృహాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శంకర్, పురుషోత్తం,అరుణ్, చరణ్,సారధి తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలి-తలపా దామోదరం రెడ్డి
శ్రీకాళహస్తి పట్టణంలోని గోపాలవనం నందు గల కోర్టు సముదాయాల వెనకవైపు గల గోడ కూలి అక్కడ నివసిస్తున్నటువంటి వారి గృహాలు ధ్వంసం కావడంతో నిర్వాసితులను పరామర్శించి,వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని తపాలా దామోదర రెడ్డి తెలిపారు.అనంతరం చరవాణి ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మార్వో కి పరిస్థితిని వివరించగా వారు స్పందిస్తూ వెంటనే సహాయక చర్యలు చేపడతామని తెలిపారని అదేవిధంగా కూలిపోయినటువంటి గృహాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శంకర్, పురుషోత్తం,అరుణ్, చరణ్,సారధి తదితరులు పాల్గొన్నారు.

