ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ మెన్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్ కి చేరుకున్న గూడూరు ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, సూళ్లూరుపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన ఎస్కేఆర్ కళాశాల నిర్ణీత 15 ఓవర్లకు 201 పరుగులు సాధించి అనంతరం 130 పరుగులకే సూళ్లూరుపేట కాలేజీని ఆల్ అవుట్ చేసి విజేతగా నిలిచి టోర్నమెంట్ విన్నెర్స్ కప్ గెలుచుకుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణరాజు, యూనివర్సిటీ తరపున వచ్చిన అబ్జర్వర్ ఎం. రవీంద్ర బాబు, సూళ్లూరుపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి అమ్మాజీ, ఎస్ కే ఆర్ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విజేతలయిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



