నల్గొండ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
జిల్లా కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఈవీఎం ల భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈరోజు (సెప్టెంబర్ 4) పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్ తో కలిసి గోదాంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ మొహరించిన సిబ్బందిని ప్రశ్నించి భద్రతా చర్యలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు.
అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేసి గోదాంకు సీల్ వేయించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మోతిలాల్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ విజయ్ కృష్ణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈవీఎంల గోదాం తనిఖి
నల్గొండ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జిల్లా కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఈవీఎం ల భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈరోజు (సెప్టెంబర్ 4) పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్ తో కలిసి గోదాంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ మొహరించిన సిబ్బందిని ప్రశ్నించి భద్రతా చర్యలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేసి గోదాంకు సీల్ వేయించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మోతిలాల్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ విజయ్ కృష్ణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు

