Tuesday, 31 March 2026
  • Home  
  • జిపి కాలనీ వాసులను పరామర్శించిన ప్రభుత్వ విప్ శ్రీధర్, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన
- E-పేపర్

జిపి కాలనీ వాసులను పరామర్శించిన ప్రభుత్వ విప్ శ్రీధర్, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన

జిపి కాలనీ వాసులను పరామర్శించిన ప్రభుత్వ విప్ శ్రీధర్, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు గడచిన కొన్ని రోజులుగా రైల్వే కోడూరు ప్రాంతంలో భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాల వలన గురువారము పంచాయతీ వెనుక భాగంలో ఉన్న తోటి కార్మికుల ఇళ్లలోకి వర్షము నీరు అధికంగా ప్రవేశించడంతో ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి కోనేటి అమర్నాథ్ వెంటనే పిల్లలను, ముసలి వారిని తాత్కాలికముగా ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించి వారికి భోజన వసతి సదుపాయం కల్పించారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అరవ శ్రీధర్, సబ్ కలెక్టర్ భావన,ప్రతి ఇంటిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతూ వీరికి ప్రభుత్వ పాఠశాల కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రి పైభాగం ఫ్లోర్అంతా ఖాళీగా ఉన్నదని అక్కడికి కొంతమందిని తరలించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. మరలా రేపు ఉదయం వచ్చి అందరు సమస్యలు తీరుస్తానని తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రేణిగుంట విమానాశ్రయంలో వినతి పత్రం ఇచ్చానని తెలిపారు. రాజంపేట భౌగోళికంగా బ్రిటిష్ కాలం నాటి భవనాలు, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం, దూరం తక్కువ రాజంపేట,రైల్వే కోడూరు ప్రజల రాజంపేట జిల్లా ఆకాంక్ష నెరవేర్చాలని ఉపముఖ్యమంత్రిని కోరానని ఆయన స్పందించారనితెలిపారు.సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు మాట్లాడుతూ గత వై 60 సంవత్సరాల నుండి పంచాయతీ కార్యాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్నామని ప్రభుత్వాలు మారిన, మా బతుకులు మారలేదని మాకు ఇక్కడే నివాసం ఉండేదానికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని వారిదృష్టికి వారితీసుకెళ్లారు. మండల రెవెన్యూ అధికారి అమర్నాథ్ మాట్లాడుతూ ఈ కాలనీ వారికందరికీ బయట ఇళ్ల స్థలం మంజూరు చేసి ఉన్నారని తెలిపారు. వీరు అక్కడికి వెళ్లే దానికి సుఖముఖముగా లేరని అన్ని వసతులు వసతులుకల్పిస్తామని తెలిపారు. నూతన పంచాయతీ కార్యాలయం నిర్మించుకునే దానికి కార్యాలయం నిర్మించుకునే ఈ స్థలమే అవసరమని అందువల్ల పట్టాల మంజూరు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పి రామకృష్ణ హెగ్డే,తెలుగుదేశం ఏఎస్పినాయకులు బత్యాల యువసేన నాయకులు పోతురాజు నవీన్, నార్జాల హేమరాజు, మైనారిటీ నాయకులు పటాన్ మౌలా, జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీదేవి, మాజీ జెడ్పిటిసి బండారు సుభద్రమ్మ, ఎన్డీఏ కోటమి నాయకులు పాల్గొన్నారు.

జిపి కాలనీ వాసులను పరామర్శించిన ప్రభుత్వ విప్ శ్రీధర్, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన

రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు గడచిన కొన్ని రోజులుగా రైల్వే కోడూరు ప్రాంతంలో భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాల వలన గురువారము పంచాయతీ వెనుక భాగంలో ఉన్న తోటి కార్మికుల ఇళ్లలోకి వర్షము నీరు అధికంగా ప్రవేశించడంతో ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి కోనేటి అమర్నాథ్ వెంటనే పిల్లలను, ముసలి వారిని తాత్కాలికముగా ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించి వారికి భోజన వసతి సదుపాయం కల్పించారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అరవ శ్రీధర్, సబ్ కలెక్టర్ భావన,ప్రతి ఇంటిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతూ వీరికి ప్రభుత్వ పాఠశాల కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రి పైభాగం ఫ్లోర్అంతా ఖాళీగా ఉన్నదని అక్కడికి కొంతమందిని తరలించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. మరలా రేపు ఉదయం వచ్చి అందరు సమస్యలు తీరుస్తానని తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రేణిగుంట విమానాశ్రయంలో వినతి పత్రం ఇచ్చానని తెలిపారు. రాజంపేట భౌగోళికంగా బ్రిటిష్ కాలం నాటి భవనాలు, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం, దూరం తక్కువ రాజంపేట,రైల్వే కోడూరు ప్రజల రాజంపేట జిల్లా ఆకాంక్ష నెరవేర్చాలని ఉపముఖ్యమంత్రిని కోరానని ఆయన స్పందించారనితెలిపారు.సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు మాట్లాడుతూ గత వై 60 సంవత్సరాల నుండి పంచాయతీ కార్యాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్నామని ప్రభుత్వాలు మారిన, మా బతుకులు మారలేదని మాకు ఇక్కడే నివాసం ఉండేదానికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని వారిదృష్టికి వారితీసుకెళ్లారు. మండల రెవెన్యూ అధికారి అమర్నాథ్ మాట్లాడుతూ ఈ కాలనీ వారికందరికీ బయట ఇళ్ల స్థలం మంజూరు చేసి ఉన్నారని తెలిపారు. వీరు అక్కడికి వెళ్లే దానికి సుఖముఖముగా లేరని అన్ని వసతులు వసతులుకల్పిస్తామని తెలిపారు. నూతన పంచాయతీ కార్యాలయం నిర్మించుకునే దానికి కార్యాలయం నిర్మించుకునే ఈ స్థలమే అవసరమని అందువల్ల పట్టాల మంజూరు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పి రామకృష్ణ హెగ్డే,తెలుగుదేశం ఏఎస్పినాయకులు బత్యాల యువసేన నాయకులు పోతురాజు నవీన్, నార్జాల హేమరాజు, మైనారిటీ నాయకులు పటాన్ మౌలా, జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీదేవి, మాజీ జెడ్పిటిసి బండారు సుభద్రమ్మ, ఎన్డీఏ కోటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.