*గోండు వీరుడి పోరాటానికి దక్కిన ఫలితం*
*కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం*
నేడు జోడేఘాట్ లో ఘనంగా కొమురం భీం వర్ధంతి
జెల్ జంగల్ జమీన్ (నీరు అడవి భూమి )పై హక్కుల కోసం ఉద్యమించిన గోండు వీరుడు కొమరం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నిర్మల్ జిల్లాలోని ఆదివాసి సంఘాలు గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి అంతేకాకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రికి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లకు ఆదివాసి గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు
కొమురం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం సంకేపల్లి గ్రామంలో 1900 సంవత్సరంలో మైనుబాయి చిన్ను దంపతులకు జన్మించాడు ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ అధికారుల వేధింపులను చూసి తట్టుకోలేక 15 ఏళ్ల వయసులోనే వారి తీరుకు నిరసనగా ఉద్యమ పంతాను ఎంచుకున్నారు గిరిజనులందరినీ ఏకం చేయడంలో కుమరం భీమ్ కిరమేరి ‘ఆసిఫాబాద్’ బాబేజారి’ పిట్టగూడా, పట్నాపూర్ కల్లేగాం శివగుడా, లైన్ పటార్,మొదలైన గ్రామాల ప్రజలందరినీ ఏకం చేశాడు భీమ్ పోరాటాల వల్ల నిజాం ప్రభుత్వాన్ని ఒక దశలో భయభ్రాంతులకు గురిచేశాడు అంతేకాకుండా నేడు ఉన్నటువంటి 1/ 70 యాక్ట్ గిరిజనుల భూములు పరాయికరణ జరగకుండా వచ్చిన చట్టాలు ఈయన పోరాటాల ఫలితమే అంతే కాకుండా గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం నిజాం ప్రభుత్వం మానవ శాస్త్రవేత్త అయిన హైమాన్ డార్క్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయించింది గిరిజనుల అవసరాలను తీర్చడంలో హైమందార్ప్ యొక్క అధ్యయనం ఎంతగానో కృషి చేశాడు ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో నూతన పాఠశాలలు,ఐటిడిఏలు, ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ మహానీయుని నేడు నిర్మల్ జిల్లాలో కూడా ఘనంగా
వర్ధంతిని గిరిజన ఆదివాసి సంఘాలు జరుపుకొన్నాయి ఎంతటికైనా కొమరం భీమ్ యొక్క పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
End


