గృహం చట్టలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం. రాజేందర్ అన్నారు. శనివారం మహమ్మద్ నగర్ గ్రామం తిప్పనపల్లి, చంద్రుగొండ మండలంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిళల పట్ల నిత్యం ఏదో ఒక చోట అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల వారు అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారని అన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా గ్రామ పెద్దలు, యువకులు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం నల్సా న్యూఢిల్లీ వారు ప్రవేశపెట్టిన ఆశ స్కీమ్ లో భాగంగా న్యాయమూర్తి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ, బాల్య వివాహ నిర్మూలన స్టిక్కర్లను ఇంటి డోర్ లకు అంటించారు. ఈ కార్యక్రమంలో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు డా”.వి. రమాదేవి, డిసిపివో యన్.ఐ.సి. ఆదురి శేషు, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ బానోత్ సందీప్, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేస్ వర్కర్ జి. భవాని, టిం ఇండియా ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చండ్రుగోండ మండల అధ్యక్షుడు నాసిర్, స్టేన్నా, తదితరులు పాల్గొన్నారు

గృహ హింస చట్టం పై అవగాహన అవసరం
గృహం చట్టలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం. రాజేందర్ అన్నారు. శనివారం మహమ్మద్ నగర్ గ్రామం తిప్పనపల్లి, చంద్రుగొండ మండలంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిళల పట్ల నిత్యం ఏదో ఒక చోట అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల వారు అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారని అన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా గ్రామ పెద్దలు, యువకులు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం నల్సా న్యూఢిల్లీ వారు ప్రవేశపెట్టిన ఆశ స్కీమ్ లో భాగంగా న్యాయమూర్తి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ, బాల్య వివాహ నిర్మూలన స్టిక్కర్లను ఇంటి డోర్ లకు అంటించారు. ఈ కార్యక్రమంలో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు డా”.వి. రమాదేవి, డిసిపివో యన్.ఐ.సి. ఆదురి శేషు, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ బానోత్ సందీప్, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేస్ వర్కర్ జి. భవాని, టిం ఇండియా ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చండ్రుగోండ మండల అధ్యక్షుడు నాసిర్, స్టేన్నా, తదితరులు పాల్గొన్నారు

