సిద్దవటం, అక్టోబర్ 17 ( వార్తలు ప్రతినిధి )
మండలంలోని మాధవరం 1 పంచాయతీ బంగారుపేట శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వహకులు అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలు,పుష్పమాలికలతో అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన పూజలో పరిసర గ్రామాల నుంచి మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.


