కామారెడ్డి, 28 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం గంగమ్మ బ్రిడ్జిపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆకస్మి కంగా సందర్శన నిర్వహించారు. కెలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కార్యక్రమ ప్రాధాన్యతను స్పష్టం చేస్తూ, త్వరిత చర్యల కోసం సంబంధిత శాఖల ప్రధానుల కు మార్గదర్శకత్వం ఇచ్చారు.వంతెనకు చేరే రహ దారి భాగంలో ఏర్పడిన గుంతను ఆయన పరిశీ లించి,అక్కడి పరిస్థితిని అధికారులతో సమీక్షిం చారు.వంతెన, రహదారి భద్రతపై కలెక్టర్ ఆందో ళన వ్యక్తం చేసి, తక్షణమే మరమ్మతులు జరగాల ని ఆదేశాలు జారీ చేశారు.రహదారి ప్రయాణంలో ఎలాంటి కష్టం లేకుండా త్వరగా పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగవలెని సూచించారు.ఈ సంద ర్శన సమయంలో ఆర్ అండ్ బి విభాగం ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ పి. మోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. రవితేజ, రామారెడ్డి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ) సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.


