Wednesday, 25 March 2026
  • Home  
  • కేరళను డ్రగ్స్ రవాణా కేంద్రంగా మార్చుకున్న మాఫియా🇮🇳🌎🇵🇰
- జాతీయ అంతర్జాతీయ

కేరళను డ్రగ్స్ రవాణా కేంద్రంగా మార్చుకున్న మాఫియా🇮🇳🌎🇵🇰

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)🇮🇳🌎🇵🇰 డి-కంపెనీ కొత్త అడ్డా సౌత్ ఇండియా… కేరళ కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ దందా దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన దావూద్ ఇబ్రహీం సిండికేట్ కేరళను డ్రగ్స్ రవాణా కేంద్రంగా మార్చుకున్న మాఫియా శ్రీలంక మీదుగా సముద్ర మార్గంలో భారీగా డ్రగ్స్ సరఫరా వ్యవస్థలోని అవినీతే డ్రగ్స్ ముఠాలకు వరంగా మారిన వైనం ఉగ్రవాద కార్యకలాపాలకు డ్రగ్స్ దందా ద్వారా నిధుల సమీకరణ భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న దావూద్ ఇబ్రహీం సిండికేట్ (డి-కంపెనీ) ఇప్పుడు తన మకాంను దక్షిణ భారతానికి మార్చింది. ముఖ్యంగా కేరళను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు ప్రధాన కేంద్రంగా మార్చుకుని దేశ భద్రతకు పెను సవాల్ విసురుతోంది. నకిలీ కరెన్సీ రాకెట్‌ను భారత ఏజెన్సీలు సమర్థంగా అడ్డుకోవడంతో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడం కోసం డి-కంపెనీ ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ వ్యాపారంపై ఆధారపడినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటివరకు పంజాబ్ సరిహద్దుల ద్వారా డ్రగ్స్‌ను దేశంలోకి పంపిన మాఫియా, అక్కడ భద్రతా బలగాల నిఘా పెరగడంతో తమ వ్యూహాన్ని మార్చుకుంది. పాకిస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను శ్రీలంకకు చేర్చి, అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేరళ తీరానికి తరలిస్తున్నారు. కేరళకున్న సుదీర్ఘ తీరప్రాంతం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉండటం, స్థానిక వ్యవస్థలోని అవినీతి వంటి అంశాలు డ్రగ్స్ ముఠాలకు అనుకూలంగా మారాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల నలుగురు జైలు అధికారులు ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. దక్షిణ భారతంలో డి-కంపెనీ కార్యకలాపాలను దావూద్ ముఖ్య అనుచరుడైన హాజీ సలీం పర్యవేక్షిస్తున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. కేరళలో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్న సలీం, ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ముఖ్యంగా మెథాఫెటమిన్ (మెత్) అనే డ్రగ్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటంతో కేరళను ఒక ట్రాన్సిట్ పాయింట్‌గా వాడుకుంటున్నారు. ఇక్కడికి చేరిన డ్రగ్స్‌ను రోడ్డు మార్గంలో తమిళనాడు, కర్ణాటక మీదుగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను గంజాయి రవాణాకు వినియోగిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ దందా కేవలం దేశీయ సరఫరాకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ కార్టెల్స్ సహాయంతో థాయ్‌లాండ్ వంటి దేశాలకు కూడా కేరళ నుంచి డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయి. ఈ అంతర్జాతీయ ఆపరేషన్ల కోసం డి-కంపెనీ నైజీరియన్లను వాడుకుంటోంది. ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో ఏకంగా రూ. 30,000 కోట్ల విలువైన మెత్ పట్టుబడటంతో ఈ మాఫియా సామ్రాజ్యం ఎంత పెద్దదో అర్థమవుతోంది. అయితే, ఈ భారీ నష్టం తర్వాత స్మగ్లర్లు తమ పద్ధతి మార్చుకుని, పట్టుబడకుండా ఉండేందుకు చిన్న చిన్న ప్యాకెట్లలో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)🇮🇳🌎🇵🇰

డి-కంపెనీ కొత్త అడ్డా సౌత్ ఇండియా… కేరళ కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ దందా

దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన దావూద్ ఇబ్రహీం సిండికేట్

కేరళను డ్రగ్స్ రవాణా కేంద్రంగా మార్చుకున్న మాఫియా

శ్రీలంక మీదుగా సముద్ర మార్గంలో భారీగా డ్రగ్స్ సరఫరా

వ్యవస్థలోని అవినీతే డ్రగ్స్ ముఠాలకు వరంగా మారిన వైనం

ఉగ్రవాద కార్యకలాపాలకు డ్రగ్స్ దందా ద్వారా నిధుల సమీకరణ

భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న దావూద్ ఇబ్రహీం సిండికేట్ (డి-కంపెనీ) ఇప్పుడు తన మకాంను దక్షిణ భారతానికి మార్చింది. ముఖ్యంగా కేరళను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు ప్రధాన కేంద్రంగా మార్చుకుని దేశ భద్రతకు పెను సవాల్ విసురుతోంది. నకిలీ కరెన్సీ రాకెట్‌ను భారత ఏజెన్సీలు సమర్థంగా అడ్డుకోవడంతో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడం కోసం డి-కంపెనీ ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ వ్యాపారంపై ఆధారపడినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇప్పటివరకు పంజాబ్ సరిహద్దుల ద్వారా డ్రగ్స్‌ను దేశంలోకి పంపిన మాఫియా, అక్కడ భద్రతా బలగాల నిఘా పెరగడంతో తమ వ్యూహాన్ని మార్చుకుంది. పాకిస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను శ్రీలంకకు చేర్చి, అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేరళ తీరానికి తరలిస్తున్నారు. కేరళకున్న సుదీర్ఘ తీరప్రాంతం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉండటం, స్థానిక వ్యవస్థలోని అవినీతి వంటి అంశాలు డ్రగ్స్ ముఠాలకు అనుకూలంగా మారాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల నలుగురు జైలు అధికారులు ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

దక్షిణ భారతంలో డి-కంపెనీ కార్యకలాపాలను దావూద్ ముఖ్య అనుచరుడైన హాజీ సలీం పర్యవేక్షిస్తున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. కేరళలో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్న సలీం, ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ముఖ్యంగా మెథాఫెటమిన్ (మెత్) అనే డ్రగ్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటంతో కేరళను ఒక ట్రాన్సిట్ పాయింట్‌గా వాడుకుంటున్నారు. ఇక్కడికి చేరిన డ్రగ్స్‌ను రోడ్డు మార్గంలో తమిళనాడు, కర్ణాటక మీదుగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను గంజాయి రవాణాకు వినియోగిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది.

ఈ దందా కేవలం దేశీయ సరఫరాకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ కార్టెల్స్ సహాయంతో థాయ్‌లాండ్ వంటి దేశాలకు కూడా కేరళ నుంచి డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయి. ఈ అంతర్జాతీయ ఆపరేషన్ల కోసం డి-కంపెనీ నైజీరియన్లను వాడుకుంటోంది. ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో ఏకంగా రూ. 30,000 కోట్ల విలువైన మెత్ పట్టుబడటంతో ఈ మాఫియా సామ్రాజ్యం ఎంత పెద్దదో అర్థమవుతోంది. అయితే, ఈ భారీ నష్టం తర్వాత స్మగ్లర్లు తమ పద్ధతి మార్చుకుని, పట్టుబడకుండా ఉండేందుకు చిన్న చిన్న ప్యాకెట్లలో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.