సీతారామపురం సెప్టెంబర్(పున్నమి ప్రతినిధి)
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సీతారామపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్, ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు భోగినేని కాశీరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేకు ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా చేసుకొని రాజకీయాల్లోకి వచ్చి పూర్తిగా ప్రజలకే అంకితమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరిన్ని ఉన్నత రాజ్యాధికార పదవులను అందుకొని రాష్ట్ర పురోగతి అభివృద్ధి పై తన మార్కును చూపెడతారన్నారు. రాష్ట్ర దేశ క్రియాశీలక రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పాత్ర ప్రత్యేకమైనదన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి జన సైనికుడు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకుడు భోగినేని కాశీరత్తయ్య (గాంధీ), సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్(రాజా), క్లస్టర్ ఇంచార్జ్ వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు యువత మండల నాయకుడు పసుపులేటి వికాస్ బాబు(విక్కి), సాగునీటి సంఘం అధ్యక్షుడు నీలి రత్తయ్య ,టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పిడుగు రమేష్, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, కూటమి నాయకులు హరికృష్ణ,తోట మనోజ్, తోట ఏడుకొండలు, కొత్త జగదీష్, తోట నవీన్, ఓబుల్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


