Sunday, 5 April 2026
  • Home  
  • ఆధ్యాత్మిక పరిమళం.. భక్తి తత్వ ప్రబోధం-శ్రీకాళహస్తిలో సద్గురు జయంతి మహోత్సవం
- తిరుపతి

ఆధ్యాత్మిక పరిమళం.. భక్తి తత్వ ప్రబోధం-శ్రీకాళహస్తిలో సద్గురు జయంతి మహోత్సవం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. ఆశ్రమ స్థాపకులు, సద్గురు స్వర్గీయ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారి 113వ జయంతి వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పాదుకలకు శాస్త్రోక్తంగా విశేష అభిషేక పూజలు, అర్చనలు జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి, ఉత్తరాధికారి శ్రీ సంపూర్ణానందగిరి స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాళీ వనాశ్రమ అధిపతులు యోగిని శ్రీ చంద్ర ప్రసాద కాళీ మాతాజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సనాతన ధర్మానికి నిలయమైన భారతదేశంలో ఆధ్యాత్మిక చింతన, భక్తి తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మమార్గాన్ని అనుసరిస్తూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ మహోత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ శాసనసభ్యులు ఎస్.సి.వి. నాయుడు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సహా పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొని స్వామివారికి నివాళులర్పించారు. ఆశ్రమ ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. ఆశ్రమ స్థాపకులు, సద్గురు స్వర్గీయ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారి 113వ జయంతి వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పాదుకలకు శాస్త్రోక్తంగా విశేష అభిషేక పూజలు, అర్చనలు జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి, ఉత్తరాధికారి శ్రీ సంపూర్ణానందగిరి స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాళీ వనాశ్రమ అధిపతులు యోగిని శ్రీ చంద్ర ప్రసాద కాళీ మాతాజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సనాతన ధర్మానికి నిలయమైన భారతదేశంలో ఆధ్యాత్మిక చింతన, భక్తి తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మమార్గాన్ని అనుసరిస్తూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ మహోత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ శాసనసభ్యులు ఎస్.సి.వి. నాయుడు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సహా పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొని స్వామివారికి నివాళులర్పించారు. ఆశ్రమ ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.