పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చి 15 : మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీనివాస నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఈస్బీ టెక్స్టైల్స్ (EESBEE TEXTILES) నూతన షోరూమ్ ను జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను, సరసమైన ధరలకే అందించాలని నిర్వాహకులకు సూచించారు. స్థానిక యువత వ్యాపార రంగంలో రాణించడం అభినందనీయమని, శ్రీనివాస గారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్,యాదవ రెడ్డి, జగని రమేష్, పగడాల శ్రీశైలం,పెద్దవూర సైదులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…



