*అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది*
– *ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *
దక్షిణ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేవిధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలిపారు ఈరోజు జోన్ – 4 కార్యాలయంలో క్షేత్రస్థాయిలో అధికారులు , బ్యాంక్ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ప్రసంగించారు .ఈ సందర్భంగా ఇళ్ల లబ్ధిదారులు బ్యాంక్ అధికారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలు సూచనలు చేశారు. బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకు సహకరించి ఋణాలు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపిడి పద్మ, స్థానిక కూటమి నేతలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు….


