శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఆర్యవైశ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం సాధన కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో AVOPA అధ్యక్షులు కోటిలింగాల శశిధర్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి ఐత మురళీకృష్ణ, అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, AVOPA మహిళా విభాగం అధ్యక్షురాలు కోటిలింగాల నిరుపమతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా – ఆర్యవైశ్యుల నివాళులు
శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఆర్యవైశ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం సాధన కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో AVOPA అధ్యక్షులు కోటిలింగాల శశిధర్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి ఐత మురళీకృష్ణ, అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, AVOPA మహిళా విభాగం అధ్యక్షురాలు కోటిలింగాల నిరుపమతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

