Monday, 23 March 2026

Tag: గణేష్

ఆంధ్రప్రదేశ్

శర్వాణి విద్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

శర్వాణి విద్యాలయంలో బుధవారం ఘనంగా వినాయక చవితి పూజను నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుని ఆశీర్వాదాలు పొందారు. ఉదయం నుంచే విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో పాఠశాలకు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి గీతాలు, శ్లోకాలతో వాతావరణం భక్తిమయమైంది. ఉపాధ్యాయులు గణనాధునికి ప్రత్యేక పూజలు చేసి, విద్యార్థులతో కలసి నామస్మరణ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీమతి సాయి రాణి మాట్లాడుతూ –“వినాయక చవితి పండుగ విద్యార్థులలో సత్కార్య భావన, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తుంది. విఘ్నేశ్వరుని ఆరాధనతో ధైర్యం, సాహసం, విజయం సిద్ధిస్తాయి. విద్యార్థులు విద్యలో శ్రద్ధ చూపి గురువులను గౌరవిస్తే గణేశుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి” అని అన్నారు.అనంతరం విద్యార్థులకు ప్రసాదం పంపిణీ చేయగా, చిన్నారులు ఆనందోత్సాహాలతో ఇంటికి చేరుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.