మొంథా తుఫాన్పై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి కీలక ఆదేశాలు”
“మొంథా తుఫాన్పై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి కీలక ఆదేశాలు” 🔴మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సూచించారు. 🔴తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రతి శాఖాధికారులు తమ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ☁️ “ఈ తుపాన్ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు🌪️ వీసే అవకాశం ఉంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అవసరమైతే పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి — ప్రజలను ముందుగానే అక్కడకు సురక్షితంగా తరలించాలి.” “ప్రజలను అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలిపారు.” ⚠️ ప్రజలకు సూచనలు: 🔴మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. 🔴తుపాన్ సమయంలో పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించి కాపాడుకోవాలి. 🔴విద్యుత్, నీటి, ఆహార సరఫరా వంటి సేవల్లో అంతరాయం రాకుండా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ☎️ అత్యవసర సహాయం కోసం: 📞 స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 112 మరియు 1070 📞 టోల్ ఫ్రీ నెంబర్: 1800-425-0101 ఏ సహాయం కావాలన్నా రాష్ట్ర లేదా జిల్లా కంట్రోల్ రూమ్లను సంప్రదించండి. ☎️📞ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం 8522084270, 9390011493. ఇట్లు మీ కాకర్ల సురేష్, ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు.










