Saturday, 4 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారిని కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని గారు

ఈరోజు తాడేపల్లి పార్టీ కార్యాలయం లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారిని కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని గారు… మెడికల్ కాలేజీల PPP విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిస్తున్న రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సోషల్ మీడియా పాత్ర అభినందనీయం అనిజగన్ కొనియాడారు అని ఆయన తెలియచేశారు సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఎదిరించి ప్రజలకు అండగా నిలబడాలి అని జగన్ గారు కోరినట్లు ఆయన తెలియచేశారు….

అన్నమయ్య

అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని ప్రారంభించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ కృష్ణ గీతా మందిరం దగ్గర భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి రథోత్సవం కుర్రమణి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అయ్యప్ప స్వామి రథోత్సవంలో ముందుగా అయిన టెంకాయ కొట్టి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు.అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.గ్రామంలోని అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తి పాటలతో నిర్వహించిన భజన బృందాన్ని తిలకరించారు.రథాన్ని ఘనంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు తాటి సుబ్బరాయుడు,బీజేపీ నాయకులు హిమగిరి నాథ్,తెలుగుదేశం పార్టీ నాయకులు మట్టి బాబు,మండెం నాగరాజు, ఉప్పు శెట్టి రెడ్డయ్య,పఠాన్ మహర్ ఖాన్,ఎల్లమ్మరాజు పల్లి శ్రీనివాసులు రెడ్డి,నితిన్, కొండిశెట్టి సుదర్శన్,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జనగాం

బేడ బుడగ జంగం జాతి ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తూనే ఉంటాము.. బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్, యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారణాసి శివవర్మ

పున్నమి: నవంబర్ 05 ప్రతినిధి: జనగాం జిల్లా: స్టేషన్ గన్పూర్: తెలంగాణ బేడ బుడగ జంగం జాతి ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తూనే ఉంటాము అని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్ అన్నారు. ఆదివారం బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి జనగాం జిల్లా నూతన కమిటీలను యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారణాసి శివవర్మ, శ్రీకారం టీం ఆధ్వర్యంలో సమావేశం స్టేషన్ గన్పూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జనగాం జిల్లా నూతన కమిటీలు నియామకం చేశారు. బి జె హెచ్ పి ఎస్, జిల్లా అధ్యక్షులుగా పస్తం యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా పస్తం రాజు, యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా కళ్లెం శివ, జిల్లా కమిటీలకు 40 మందికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బేడ బుడగ జంగాలు రాజకీయ, ఆర్థిక సామాజికంగా ముందుకు తీసుకువెళ్లడంలో తమ వంతు పాత్ర వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు సిరివాటి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరివాటి రామకృష్ణ, యూత్ ఉపాధ్యక్షులు అశ్వ జమ్మన్న, వారణాసి రామకృష్ణ, ప్రసాద్, పస్తం బాలు, శ్రీహరి, కళ్లెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే గోరంట్ల.

రాజమహేంద్రవరం రూరల్ : పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం వార్డులు వారిగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక 19వ డివిజన్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపంలో సఖి సురక్ష కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం ద్వారా బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహిళలకు స్క్రీన్ టెస్ట్ లు అవసరమైన వారికి మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ వైద్యం అంధక ఏ ఒక్కరు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. అవసరమైన వారికి వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు . ఈ 14 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి చర్యలు చేపడుతుందన్నారు. శీలం గోవింద్, నిమ్మలపూడి గోవింద్, రొంపిచర్ల ఆంటోనీ, కొప్పిశెట్టి చిన్ని, కక్కల రమేష్, చిట్టిబోయిన శ్రీనివాస్, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, నరసింహమూర్తి, చలమూరి సత్యనారాయణ, సింగవరపు సత్యనారాయణ, కేత అప్పారావు, పాలిక వెంకటరమణ, వాసు, కుసుమ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గొప్ప నిర్ణయం – పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులు స్వయంగా భరించనున్న సంజయ్ కుమార్:

పువ్వాడ నాగేంద్ర కూమర్ (తెలంగాణ పున్నమి ప్రతి నిధి) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ఫీజు భారం లేకుండా చేయాలని కరీంనగర్ ఎంపీ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును తన వేతనం నుండి పూర్తిగా చెల్లించనున్నట్టు ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నారు. కరీంనగర్ జిల్లా – 4,847 మంది సిరిసిల్ల జిల్లా – 4,059 మంది సిద్ధిపేట జిల్లా – 1,118 మంది జగిత్యాల జిల్లా – 1,135 మంది హన్మకొండ జిల్లా – 1,133 మంది వారి పరీక్ష ఫీజుల కోసం సుమారు ₹15 లక్షలు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని తన వేతనం నుండి భరించనున్నట్టు ఎంపీ తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖలు పంపించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రేరణతో, “వికసిత్ భారత్” కల సాకారం చేయడంలో తన వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

రంగారెడ్డి

బీసీ రిజర్వేషన్ల ఉద్యమం బలంగా జరగాలి.. బహుజన్ సమాజ్ పార్టీ,(BSP) పల్లాటి రాములు, గ్యార మల్లేష్, కంబాలపల్లి శాంత, వంగాల కృష్ణ ప్రసాద్

పున్నమి: నవంబర్ 05 రంగారెడ్డి జిల్లా: బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు వంగాల కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్న ఈ సమావేషానికి ముఖ్య అతిథులుగా పల్లాటి రాములు, జిల్లా కార్యదర్శి గ్యార మల్లేష్, మహిళా ఇంచార్జీ కంబాలపల్లి శాంత హాజరై, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఈరోజు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్ లను రిలీజ్ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం నుండి నాగన్ పల్లే వెళ్లే మార్గంలో ఉన్న రోడ్లను అదేవిధంగా మూలమలుపు దగ్గర ఉన్న భయంకరమైన చెరువు నీ సందర్శించి వెంటనే రోడ్లను అదేవిధంగా చెరువుకి అడ్డంగా ఏదైనా ప్రమాదం జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేశారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శిగా ధార సిరి ( లావణ్య ) మరియు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సోషల్ మీడియా కన్వీనర్ గా ఏర్పుల రవి కుమార్,మునుగనూరు వార్డు అధ్యక్షులుగా అల్వాల జాన్ కుమార్, ఇంజాపూర్ వార్డు అధ్యక్షులుగా మీసాల రవి కుమార్ లకు పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షులు గుండె శ్రీనివాస్, కోశాధికారి బంగారీగల్ల మహేందర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు మంద రాజు, ఉపాధ్యక్షులు చెరుకూరి కరుణాకర్, తుర్క యంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పట్నం రమేష్ కురుమ, మరియు కమిటీ సభ్యులు మరియు చిత్రం కృష్ణ, గోరటి కుమార్, మేడిపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం

ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. దీంతో చంద్రుడు సాధారణం కంటే 14% పెద్దగా, 30% అధిక కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని “బీవర్ సూపర్ మూన్”గా పిలుస్తున్నారు. మనదేశంలో రాత్రి 6:49 గంటలకు పూర్ణ చంద్రుడు దర్శనమిస్తాడు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.

తిరుపతి

బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సి.యం. రిలీఫ్ ఫండ్ అందజేసిన బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి పట్టణములో బాధితుల ఇండ్లబద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధిని బొజ్జల బృందమ్మ అందించారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ…. పట్టణంలో కొంతమందికి ఆరోగ్యం క్షీణించిందని వారికి సహాయం చేయవలసినదిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కోరడం జరిగినదని ముఖ్యమంత్రి ఎమ్మేల్యే విన్నపాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధిని విడుదల చేయడం జరిగిందని ఆ సహాయ నిధిని వారి ఇండ్ల వద్దకే వెళ్లి అందించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి పేదవారికి ఈ రూపంలో సహాయం చేయడం చాలా సంతోషకరమని పట్టణంలో సి.యం. రిలీఫ్ ఫండ్ అందుకున్న వారి వివరాలు బి మల్లేశ్వరికి 27941/- రూపాయలు, ఏ పరమేశ్వరికి 25000/- ఎస్ నరేష్ కి 84928/- రూపాయలు ఏ రాంప్రసాద్ కు 176499/- ఎల్ గోపాల్ కు, 20524/- రూపాయలు బి బుజ్జమ్మ కు 90728/- పి నీరజ కు 35914 /- రూపాయలు మొత్తం కలిపి 461534/- రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేస్తూ.. తమా ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు 241 మంది బాధితులకు 2, 62,60,033/-అందించామని, మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మూడో వార్డు గోవిందు, మూడో వార్డు శివ బ్యాంకు కరీం, షఫీ ,వెంకటేష్ చౌదరి, అస్మత్, రామచంద్రయ్య , కరీం, జహీర్ అహ్మద్ , దారా పాండు, కేవీ ప్రతాప్ ,నాగరాజు, నెమళ్ళూరు సుబ్రహ్మణ్యం టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఆలయాల్లో లక్షాదీపారాధన ఘనోత్సవం

కామారెడ్డి, 5 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంతో పాటు ఉప్పల్వాయి, పోసానిపేట్, రెడ్డిపెట్ తదితర గ్రామాలలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిఫలింపజేసే ప్రాచీన రామాల యంలో ఇటీవల ఘనమైన లక్షా దీపారాధన ఉత్స వం జరిగింది. జ్వాలతోరణం, గోమత అలంకర ణతో ప్రత్యేక పూజలు, దశ హారతులు, సంస్కృతిక కార్యక్రమాలతో కూడిన ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్తిక పౌర్ణమి రోజున మహిళ లు దివ్యభక్తితో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూ తులను పొందటం విశేషం. లక్షాదీపాల వెలుగుల ఆకాశం క్రింద రామాలయం ఆలయ ప్రాచీనతను ప్రతిబింబిస్తూ, భక్తుల మతీస్థి తికి ఆరాధన నాణ్యతను బోధించింది. స్థానికులు పూజల్లో పాల్గొని, ఆధ్యాత్మిక శాంతి, ఆనందాన్ని ఆస్వాదించారు. ఆలయ సుందర అలంకరణ, దీపాల వెలుగులు భక్తులను ఆహ్లాద పరచడంతో పాటు ప్రాంతీయ సాంప్రదాయాలను మరోసారి పటిమగా ప్రదర్శించా యి.ఈ సంబరాలు రామారె డ్డి మండల ప్రజల ఆధ్యాత్మ క అవసరాలను తీర్చే వేదికగా నిలిచి, భక్తి జగ్రత్తు, పూజా విధానాల పరంపర కొనసాగిం పుకు దోహదపడ్డాయి. దశ హారతుల వేళలో పరస్పర భక్తి పరస్పర స్ఫూర్తిని మరింత పెంపొం దించింది. ఈ వేడుకలు ప్రాచీన స్థానిక సంప్రదాయానికి నిలిచారు.లక్షాదీపారాధన అభిమానులు రోజువారీ జీవితంలో మరింత మౌలిక శాంతి, ఆధ్యాత్మిక పరాకాష్టలను పొందేం దుకు ఈ ఉత్సవాలు మార్గదర్శకమయ్యాయి. .

కామారెడ్డి

ఆలయాల్లో లక్షాదీపారాధన ఘనోత్సవం

కామారెడ్డి, 5 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంతో పాటు ఉప్పల్వాయి, పోసానిపేట్, రెడ్డిపెట్ తదితర గ్రామాలలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిఫలింపజేసే ప్రాచీన రామాల యంలో ఇటీవల ఘనమైన లక్షా దీపారాధన ఉత్స వం జరిగింది. జ్వాలతోరణం, గోమత అలంకర ణతో ప్రత్యేక పూజలు, దశ హారతులు, సంస్కృతిక కార్యక్రమాలతో కూడిన ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్తిక పౌర్ణమి రోజున మహిళ లు దివ్యభక్తితో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూ తులను పొందటం విశేషం. లక్షాదీపాల వెలుగుల ఆకాశం క్రింద రామాలయం ఆలయ ప్రాచీనతను ప్రతిబింబిస్తూ, భక్తుల మతీస్థి తికి ఆరాధన నాణ్యతను బోధించింది. స్థానికులు పూజల్లో పాల్గొని, ఆధ్యాత్మిక శాంతి, ఆనందాన్ని ఆస్వాదించారు. ఆలయ సుందర అలంకరణ, దీపాల వెలుగులు భక్తులను ఆహ్లాద పరచడంతో పాటు ప్రాంతీయ సాంప్రదాయాలను మరోసారి పటిమగా ప్రదర్శించా యి.ఈ సంబరాలు రామారె డ్డి మండల ప్రజల ఆధ్యాత్మ క అవసరాలను తీర్చే వేదికగా నిలిచి, భక్తి జగ్రత్తు, పూజా విధానాల పరంపర కొనసాగిం పుకు దోహదపడ్డాయి. దశ హారతుల వేళలో పరస్పర భక్తి పరస్పర స్ఫూర్తిని మరింత పెంపొం దించింది. ఈ వేడుకలు ప్రాచీన స్థానిక సంప్రదాయానికి నిలిచారు.లక్షాదీపారాధన అభిమానులు రోజువారీ జీవితంలో మరింత మౌలిక శాంతి, ఆధ్యాత్మిక పరాకాష్టలను పొందేం దుకు ఈ ఉత్సవాలు మార్గదర్శకమయ్యాయి. .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.