Friday, 3 April 2026

Blog

విశాఖపట్నం

సినర్జీస్ కుటుంబాల ఆకలి పోరాటం….*

*సినర్జీస్ కుటుంబాల ఆకలి పోరాటం….* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* *మా భర్తల కు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి..* *గేటు ముందు పిల్లల తో బైఠాయించిన తల్లులు..* దువ్వాడ VEPZ లో సినర్జీస్ కార్మికుల సమ్మె పోరాటం లో కీలక పరిణామం చోటు చేసుకుంది.. గత 45 రోజులుగా జీతాల బకాయి ల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈ రోజు బార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు .. సగం నిండిన గంజి అన్నం, కాలీ ప్లేట్లు తో పిల్లల ను తెచ్చి నిరసన తెలిపారు.. పొరుగు జిల్లాల నుండి పదేళ్ల నాడు పొట్ట చేతపట్టుకుని వేస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులివ్వక పోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసు కున్నారు.. స్కూలు ఫీజులు, ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్తితి కి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సమ్మెకు సంఘీభవంగా ఏఐటీయూసీ నేత డాక్టర్ బూసి వెంకట రావు మాట్లాడుతూ కార్మికుల పి ఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వక పోవడం మొండి తనం అన్నారు.. కూటమి పెద్దల అండ ఉందని జె సి ఎల్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎమ్ రాంబాబు, అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి దాసు, వెంకట రావు, రమణ పాల్గొన్నారు

హైదరాబాద్

నేటితో జూబ్లీహిల్స్‌ ప్రచారానికి తెర

పువ్వాడ నాగేంద్ర కుమార్ ( పున్నమి దినపత్రిక తెలంగాణ ప్రతి నిధి) జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రబలమైన ప్రణాళికలు అమలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ తమ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తూ ర్యాలీలు, మినీ మీటింగ్‌లు నిర్వహించాయి. ఈ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,98,056 మంది మహిళలు, 2,03,309 మంది పురుషులు కాగా, 18 మంది ఇతర లింగ వర్గానికి చెందినవారు. మొత్తం 123 పోలింగ్‌ కేంద్రాల్లో రేపు ఓటింగ్‌ జరగనుంది. ప్రధానాంశాలు: చివరి దశకు చేరిన ఎన్నికల ప్రచారం 115 జూబ్లీహిల్స్‌ బూత్‌లలో రేపు పోలింగ్‌ పోటీదారుల మధ్య హోరాహోరీ పోరు బిజీగా సర్వేలు, వ్యూహరచన: ప్రచార చివరి రోజున బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శిబిరాల్లో వ్యూహరచనకు వేడి చర్చలు కొనసాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే చివరి ప్రయత్నంగా పార్టీలు డోర్‌ టు డోర్‌ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్‌ పక్షం నుండి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా ప్రచార సమీక్ష నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కూడా శ్రేణులతో సమావేశమై తుది వ్యూహాన్ని ఖరారు చేశారు

E-పేపర్

అనంతసాగరం లొ బీజేపీ మండల సమావేశం

అనంతసాగరం మండల కేంద్రంలో బీజేపీ మండల సమావేశం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బీజేపీ జిల్లా కార్యదర్శి, మండల ఇంచార్జి కరటంపాటి సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పలు అంశాలు చర్చించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ కుమార్, ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

అనంతసాగరం లొ బీజేపీ మండల సమావేశం

అనంతసాగరం మండల కేంద్రంలో బీజేపీ మండల సమావేశం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బీజేపీ జిల్లా కార్యదర్శి, మండల ఇంచార్జి కరటంపాటి సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పలు అంశాలు చర్చించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ కుమార్, ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

అనంతసాగరం లొ బీజేపీ మండల సమావేశం

అనంతసాగరం మండల కేంద్రంలో బీజేపీ మండల సమావేశం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బీజేపీ జిల్లా కార్యదర్శి, మండల ఇంచార్జి కరటంపాటి సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పలు అంశాలు చర్చించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ కుమార్, ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కనిగిరిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా కనిగిరిలోని కూచిపూడిపల్లిలో శనివారం జొన్నలగడ్డ సృజన్ (52) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మహబూబ్ నగర్

బీసీ సమాజ్ మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో చాయి పే చర్చ కార్యక్రమం

బీసీ సమాజ్ మహబూబ్ నగర్ జిల్లా చాయ్ పే చర్చ కార్యక్రమంలో. బీసీ సమాజ్ మహబూబ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో క్రిస్టియన్ పల్లి లోని ఎం వి ఎస్ కళాశాల మైదానంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలంటే అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేస్తేనే సాధ్యమవుతాయని అన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడితేనే తప్ప బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్య, రిటైర్డ్ సబ్ రిజిస్టర్ వెంకటయ్య, రిటైర్డ్ జిహెచ్ఎం శ్రీనివాసులు,రిటైర్డ్ టీచర్ భగవంతు,రిటైర్డ్ ఎంఈఓ కురుమూర్తి,BTF జిల్లా అధ్యక్షుడు పట్నం చెన్నయ్య, BTFజిల్లా ప్రధాన కార్యదర్శి బాల శంకర్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం.ఎన్. విజయకుమార్, ఇంటలెక్చువల్ ఫోరం జుర్రు నారాయణ యాదవ్,కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, సగర సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, జాండ్ర సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు మహేందర్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా యూత్ ప్రెసిడెంట్ పాలమూర్ వెంకటేష్ గౌడ్, బీసీ సమాజ్ దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి.శేఖర్, బీసీ సమాజ్ మహబూబ్నగర్ నియోజకవర్గ కన్వీనర్ దుర్గేష్, బీసీ సమాజ్ భూత్పూర్ మండల కన్వీనర్ ఆంజనేయులు, టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ పట్టణ ఉపాధ్యక్షుడు టి .కృష్ణ, ఉమాపతి, బీరయ్య, మోహన్, వెంకటయ్య ,భాస్కర్,రాఘవేంద్ర, టీచర్ కృష్ణ, వెల్టూర్ నరేందర్, రఘు,సాయి శంకర్, జగన్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

*ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన BRS మారపాక రమేష్

తేది:09-11-2025 Neela Rakesh ఘనపూర్ పున్నమి ప్రతినిధి… *ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు మారపాక రమేష్ గారు *06-11-2025* రోజున పల్లగుట్టలోని *ఎలకంటి వీరస్వామి* అనారోగ్యంతో మృతిచెందారు ఈ విషయం తెలుసుకున్న *మారపాక రమేష్* గారు BRS పార్టీ గ్రామ నాయకుల ద్వారా *ఎలకంటి వీరస్వామి* కుటుంబాన్ని పరామర్శించి 50kgల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ కలుకొల్ల చొక్కయ్యగారు, కొంత రవీందర్ గారు, సీనియర్ నాయకులు వేల్పుల గట్టేష్ యాదవ్, కన్నెబోయిన రాజు, జీడి సంపత్ సాధం రాజు, కుంచాల యాదగిరి,కుంచాల రాజు, కొయ్యడ రమేష్, బండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

బస్టాండ్‌కు దగ్గరగా చెత్త దిబ్బ — ప్రజల ఆరోగ్యానికి ముప్పు

నందలూరు మండలం లోని ప్రధాన బస్టాండ్‌ సమీపంలో కూతవేటు దూరంలోనే చెత్తను పారవేస్తూ, ఆ ప్రదేశం పూర్తిగా డంపింగ్‌ యార్డ్‌గా మారిపోయింది. ఈ మార్గం గుండా వెళ్తున్నా ప్రజలకి,చెత్త దిబ్బల వల్ల దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఈ చెత్త కారణంగా దోమలు,పందులు,దుర్వాసనలు విస్తరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చెత్త కుప్పల్లో కుళ్ళిపోతున్న వ్యర్థాలు పలు రకాల వ్యాధులకు కారణమవుతుండగా,పిల్లలు, వృద్ధులు తరచుగా జ్వరాలు,చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రజలు పంచాయతీ అధికారులను వెంటనే చర్యలు తీసుకుని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచాలని,చెత్త పారవేసే ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు అదే దారిలో తరచూ వెళ్తున్న ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు కూడా ఈ దృశ్యాన్ని చూసినా కనీసం స్పందించడం లేదు.

జనగాం

సీఎం రేవంతన్నకు ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు

పున్నమి న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలసి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.