Friday, 3 April 2026

Blog

రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి చేసే నాయకులను గెలిపిస్తారు.సబితా ఇంద్రారెడ్డి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా నల్ల పోచమ్మ దేవాలయం, నాగార్జున నగర్ కాలనీ, ఎల్లారెడ్డి గూడ పరిసర కాలనీల్లో సబితా ఇంద్రారెడ్డి ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా స్థానిక ప్రజలు, మహిళలు, యువత కారు గుర్తు నినాదాలతో నీరాజనాలు పలికారు.పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధత గలవారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కారు గుర్తుకు ఓటు వేయండి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచండి మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించండిఅని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ నవీన్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం సభ్యులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు – బీజేపీ పిలుపు

దేశంలో స్వావలంబనను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రాంప్రసాద్ స్వగృహం నందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు “ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు” ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ – విదేశీ వస్తువుల బదులు భారతీయంగా తయారైన ఉత్పత్తులను వినియోగించాలని, దీని ద్వారా దేశీయ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, కూలీలు బలోపేతం అవుతారని తెలిపారు.మన దేశంలో తయారైన వస్తువులు ఉపయోగించడం అంటే కేవలం దేశభక్తి మాత్రమే కాదు, ఆర్థిక స్వావలంబనకు దారి తీసే మార్గం కూడా” అని బీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు.స్వదేశీని వాడండి దేశాన్ని బలపరచండి అనే నినాదంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది అని తెలిపారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు నందలూరు మండలంలో పలు పంచాయతీల్లో స్వదేశీ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి,ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, రాష్ట్ర దళిత మోర్చ్ రమణయ్య ,జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ విఠలాచార్య స్వామి,మాజీ మండల అధ్యక్షుడు ఆండ్ర శివారెడ్డి,తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మహర్ ఖాన్,మండల ఉపాధ్యక్షుడు సివి,సుబ్బయ్య, మండెం నాగేంద్ర,ప్రధాన కార్యదర్శులు రాజబోయిన మహేష్, కొండపల్లి గంగయ్య,బీజేపీ పార్టీ యువనాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి,రాచూరి మురళి,తదితరులు పాల్గొనడం జరిగినది.

అన్నమయ్య

గరికపాటి శివశంకర్ ఏపీ ఆర్‌డీసీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకారం

గన్నవరం నియోజకవర్గానికి ఇన్చార్జిగా పనిచేస్తున్న ప్రముఖ జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఈరోజు ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (AP RDC) డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పార్టీ సమన్వయకర్త అతిగారి కృష్ణ, జోగినేని మణి, ఆనాల సునీల్ కుమార్ తదితర జనసేన నాయకులు పాల్గొని శివశంకర్‌కు హార్దిక అభినందనలు తెలిపారు.పార్టీ కార్యకలాపాల్లో చూపిన అంకితభావం, సామాజిక సేవ పట్ల నిబద్ధత, గ్రామీణాభివృద్ధి పట్ల దృష్టి గరికపాటి శివశంకర్ నియామకానికి ప్రధాన కారణమని నేతలు అభిప్రాయపడ్డారు. గన్నవరం ప్రాంత అభివృద్ధి దిశగా శివశంకర్ కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసం స్థానిక నాయకులలో వ్యక్తమైంది.ఈ సందర్భంగా జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆత్మీయతతో కూడిన ఈ వేడుక స్ఫూర్తిదాయకంగా, ఉత్సాహభరితంగా సాగింది.

అన్నమయ్య

20 ఏళ్లుగా నిరుపయోగంగా ప్రభుత్వ భవనం -రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కోసం నిర్మించిన భవనం మూత – శిథిలమవుతున్న ఆస్తిని పునరుద్ధరించాలని స్థానికుల డిమాండ్

చిట్వేల్ మండలంలో ప్రభుత్వ నిధులతో సుమారు 20 ఏళ్ల క్రితం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) కోసం ప్రత్యేకంగా నిర్మించిన భవనం ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. ఈ సుదీర్ఘ కాలంలో ఒక్క రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కూడా ఈ భవనాన్ని వినియోగించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాత్కాలిక వినియోగం:ఈ భవనాన్ని కొద్దికాలం పాటు గ్రామ రెవెన్యూ అధికారులు మాత్రమే అనధికారికంగా ఉపయోగించారు. ఆ తర్వాత భవనం పూర్తిగా మూసివేయబడింది శిథిలావస్థ: ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంటుంది. ప్రభుత్వ ఆస్తి వృథాగా పోతుండటంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆదివారం నాడు స్థానిక ప్రజలు స్పందిస్తూ, నిరుపయోగంగా ఉన్న ఈ భవనాన్ని అధికారులు తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. ఆ భవనాన్ని రెవెన్యూ కార్యకలాపాల కోసమైనా, లేదా ఇతర అత్యవసర ప్రభుత్వ అవసరాల కోసమైనా వినియోగించాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిధులు వృథా కాకుండా, ప్రజల సౌకర్యార్థం ఈ భవనానికి వెంటనే మరమ్మతులు చేసి, వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

కాకినాడ

అవయవ దానమే – జీవదానం : ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.

పున్నమి న్యూస్,కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ: నవంబర్ 9: జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “అవయవ దానం అవగాహన కార్యక్రమం” ఆదివారం కాకినాడలో విజయవంతంగా నిర్వహించబడింది. ఉదయం అపోలో హాస్పిటల్, కాకినాడ వద్ద వందలాది మంది వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సామాజిక సేవకులు, మరియు ప్రజలు పాల్గొని వాక్‌థాన్ నిర్వహించారు. ఈ వాక్‌థాన్ ఫాబిన్ కన్వెన్షన్ హాల్ వరకు సాగి, ప్రజల్లో అవయవ దానం ప్రాముఖ్యతపై విశేష అవగాహన కలిగించింది.తదుపరి జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (ఎంపీ, కాకినాడ) పాల్గొన్నారు. అవయవదానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడటం అత్యున్నతమైన సేవ అని అన్నారు. గౌరవ అతిథులుగా కె. పద్మశ్రీ (ఎంఎల్‌సి) పాల్గొని అవయవదానం యొక్క సామాజిక ప్రాధాన్యతను వివరించారు.ప్రత్యేక ఆహ్వానితులుగా డా. లవణ్య కుమారి (సూపరింటెండెంట్, జిజిహెచ్), డా. ఏ. విష్ణువర్ధన్ (ప్రిన్సిపల్, రంగారాయ మెడికల్ కాలేజ్), డా. కె. బాబ్జీ మాజీ సంచాలకులు మరియు వైద్య విద్యా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డా. రామకృష్ణ మరియు డా. సోమయాజులు (ట్రస్ట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్), సుభాకర్ (మెడికవర్ హాస్పిటల్స్), మరియు డా. జి.వి. రావు (అపోలో హాస్పిటల్స్) కూడా పాల్గొని అవయవదానంపై విలువైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డా. కె. రాంబాబు, డైరెక్టర్, వీఐఎంఎస్ మరియు సీటీసీ జీవనదాన్ ఏపీ, ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, అవయవదాత కుటుంబాలకు సన్మానాలు, మరియు అవగాహన ప్రసంగాలు జరిగాయి. పాల్గొన్నవారందరూ “అవయవ దానం – జీవదానం” అనే నినాదంతో ప్రేరణ పొందారు. జీవనదాన్ ఏపీ తరపున అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కామారెడ్డి

కాలభైరవస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభం కాలభైరవ భక్తి రంజకంగా ఉత్సవాలు

కామారెడ్డి, 9 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలో ఉన్న దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ కాలభైరవస్వామి దేవాలయం తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ప్రంగణం కార్తీకమాసం సందడి మధ్య ఆధ్యాత్మి కతతో కిటకిటలాడింది.కార్తీకమాసం కారణంగా రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుం దనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చి ఆలయ ప్రాంగణం వెలుగొందింది. కార్తీక పౌర్ణమి అనంతరం ప్రారంభ మైన భైరవుని జన్మదిన మహోత్సవాలు వచ్చే ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగ నున్నాయని ఆలయ ఈఓ ప్రభు స్వామి తెలిపా రు.నవంబర్ 09 నుంచి 13 వరకు జరగ నున్న ఈ మహోత్సవాల్లో డోలారోహణం (తొట్టె), భజన మండళ్లు, రథోత్సవం, అగ్నిగుండాల కార్య క్రమాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ సమితి ఆధ్వర్యంలో వసతి గదులు, స్నానాల గదులు, నిత్య అన్నదానం వంటి సదుపాయాలు విస్తృతంగా కల్పించబడ్డాయి. ఈ మాసంలో చేసే పూజలు ఆధ్యాత్మిక శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తాయని పురాణాలు సూచిస్తున్నాయని తెలిపారు. ప్రతి మంగళవారం, పౌర్ణమి రోజుల్లో భక్తజనం రద్దీ మరింత పెరుగు తున్నట్లు వెల్లడిం చారు.స్థానిక విశ్వాసాల ప్రకారం ఆలయంలోని మూలబావి వద్ద స్నానం చేసి, స్వామి వారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఇక్కడి ప్రజలకు ఉంది. ఆలయం పరిస రాల్లో శనేశ్వరాలయం, బద్దిపోచ మ్మ దేవాలయం, నవగ్ర హ మండపం, సంతాన నాగదేవత విగ్రహా లుండటం ఈ ప్రాంత ఆధ్యాత్మి కతకు మరింత వైభవం చేకూరుస్తోంది. ఉత్సవాలు భాగంగా మొదటి రోజు బాగా మొదటి రోజు బద్ది పోచమ్మకు బోనాల సమర్పణ ఘనంగా నిర్వహించారు. నిర్వ హించారు.ఈ మహోత్సవాల్లో ఆలయ కమిటీ, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక మాజీ సర్పం చ్‌లు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈనెల 12వ తారీఖున జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం నియోజకవర్గ స్థాయి ర్యాలీ”

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం:మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యారావు గారు ఈరోజు సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల మండల పార్టీ అధ్యక్షులు, కుమారుడు గొల్లపల్లి శ్రీధర్ తో సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశం లో భాగంగా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12వ తారీఖున జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం నియోజకవర్గ స్థాయి ర్యాలీ” కార్యక్రమం గురించి చర్చించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు: కుసుమ చంద్రశేఖర్, అడబాల బ్రహ్మాజీ, కట్టా శ్రీనివాస్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య పాల్గొన్నారు.

E-పేపర్

సోషలిజం వైపు సమాజ మార్పు తథ్యం

వ్యవసాయ కార్మిక సంఘం, CITU మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో *భారత దేశం మీద అమెరికా సుంకాలుఅనే అంశం మీద క్లాసు నిర్వహించడం జరిగింది. ఈ క్లాసు కు గాడి సుధాకర్ గారు అధ్యక్షత వహించారు.ఈ క్లాసు ను జిల్లా స్టడీ సర్కిల్ నాయకులు శ్రీహరి గారు బోధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంమీద అమెకరిక పెత్తనం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచంలో అమెరికా డాలర్ విలువ పడిపోతున్నది.డాలర్ విలువ పెంచడం కోసం ఈ రోజు అమెరికా ప్రపంచ దేశాల మీద ట్రంప్ సుంకాల యుద్ధం ప్రకటించారు. ఈ సుంకాలు భారతదేశం తప్ప మిగతా దేశాలు వ్యతిరేకిస్తున్నారు. భారత దేశం కూడా ఎగుమతి సుంకాలు రద్దు చేయాలని అన్నారు.ప్రపంచంలో అనేక దేశాలు సోషలిజం కోసం పోరాడుతున్నారు.ప్రపంచ పెట్టుబడి దేశం గా ఉన్న అమెరికా దేశంలో అక్కడ ఉండే యువత సోషలిజం వైపు వస్తున్నారని.అందుకే న్యూయార్క్ నగరంలో మేయర్ అభ్యర్థిగా సోషలిస్టు భావాలు ఉన్న వ్యక్తి గెలిచారని అన్నారు.కావున పోరాటాల ఫలితంగా సోషలిజం వైపు ప్రపంచం మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి అన్వర్ బాషా,రైతు సంఘం మండల నాయకులు డాక్టర్ సుబ్బారాయుడు,జన విజ్ఞాన వేదిక నాయకులు వేము పెంచలయ్య, CITU అనంతసాగరం మండల కన్వీనర్ ఉప్పలపాడు మస్తాన్,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగులూరు వెంకటేష్,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి మీరా మొహిద్దిన్,DYFI నాయకులు సందాని మరియు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

ఇటీవల మృతి చెందిన కుటుంబానికి చంద్రన్న ప్రమాద బీమా నగదును తెలుగు దేశo పార్టీ నాయకులు నగదు పంపిణీ*

( పున్నమి)* 09:దుత్తలూరు దుత్తలూరు మండలo లోని నర్రవాడ గ్రామంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కలిగి ఇటీవల మృతి చెందిన కుటుంబానికి ప్రమాద బీమా నగదును తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం అందజేశారు. తెదేపా సభ్యత్వం కలిగిన వారిని ఆదుకునేందుకు ***గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సహకారంతో దుత్తలూరు మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండేలా గురువారెడ్డి మరియు నర్రవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి* గురవయ్య నాయుడు * ఆదేశాల మేరకు…….. మండలంలోని నర్రవాడ గ్రామానికి చెందిన *సవరం* వెంగయ్య* మృతిచెందగా నామిని అయినటువంటి ఆయన భార్య *సవరం లక్ష్మమ్మ కు రూ.5లక్షలు అందజేశారు*. కార్యక్రమంలో మాదాల తిమ్మయ్య ధారపనేని చెన్నకేశవులు తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సినర్జీస్ కుటుంబాల ఆకలి పోరాటం….*

*సినర్జీస్ కుటుంబాల ఆకలి పోరాటం….* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* *మా భర్తల కు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి..* *గేటు ముందు పిల్లల తో బైఠాయించిన తల్లులు..* దువ్వాడ VEPZ లో సినర్జీస్ కార్మికుల సమ్మె పోరాటం లో కీలక పరిణామం చోటు చేసుకుంది.. గత 45 రోజులుగా జీతాల బకాయి ల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈ రోజు బార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు .. సగం నిండిన గంజి అన్నం, కాలీ ప్లేట్లు తో పిల్లల ను తెచ్చి నిరసన తెలిపారు.. పొరుగు జిల్లాల నుండి పదేళ్ల నాడు పొట్ట చేతపట్టుకుని వేస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులివ్వక పోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసు కున్నారు.. స్కూలు ఫీజులు, ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్తితి కి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సమ్మెకు సంఘీభవంగా ఏఐటీయూసీ నేత డాక్టర్ బూసి వెంకట రావు మాట్లాడుతూ కార్మికుల పి ఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వక పోవడం మొండి తనం అన్నారు.. కూటమి పెద్దల అండ ఉందని జె సి ఎల్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎమ్ రాంబాబు, అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి దాసు, వెంకట రావు, రమణ పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.