Thursday, 2 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జిగ్రిస్’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల

సినీ ప్రేక్షకులకు మత్తెక్కించే ఉత్సాహం రాబోతోంది. మౌంట్ మెరు పిక్చర్స్ సమర్పణలో రూపొందిన ‘జిగ్రిస్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్‌లు ఇప్పటికే సోషల్ మీడియా వేదికలపై హల్‌చల్ సృష్టిస్తున్నాయి. “మూడురోజులు మాత్రమే మిగిలాయి… మాడ్‌నెస్ రాబోతోంది!” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ కెవి, మనివాక, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణ బాధ్యతలు మౌంట్ మెరు పిక్చర్స్ నిర్వహించగా, హరీష్ ఉత్, కృష్ణ వాగల్, వినైచిట్టెం, సయ్యద్ కమ్రాన్, చాణక్య ఆర్ట్, వాసుదేవ మాక్, వంశీ శేఖర్ తదితరులు ఈ ప్రాజెక్ట్‌కి మద్దతు అందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తల్లికి వందనం – చెల్లింపు విఫలమైనవారికి ముఖ్య సమాచారం!

ప్రభుత్వం తెలిపిన ప్రకారం, తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు నమోదయ్యాయి. 🔹 ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉన్నాయి: 1️⃣ పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసి నవంబర్ 13, 2025లోపు అప్‌డేట్ చేయాలి. 2️⃣ మీ బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ మారినట్లయితే, దయచేసి వెంటనే మీ సచివాలయ సిబ్బంది / బ్యాంకు శాఖ ను సంప్రదించండి. 3️⃣ సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంక్‌లో ఖాతా వివరాలు నవీకరించేలా సహాయం చేస్తారు. గమనిక: మీరు “తల్లికి వందనం” పథకానికి అర్హురాలైతే, కానీ మీకు ఇంకా డబ్బు రాకపోతే, వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. చివరి తేదీ:* నవంబర్ 13, 2025 NPCI LINK UPDATE ( ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న వాళ్లకు మాత్రమే డబ్బులు వస్తుంది.) చెక్ చేసుకోగలరు NPCI Status Check Online 2025: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ సమాచారాన్ని ఇతర తల్లులకు కూడా షేర్ చేయండి — ఎవరికైనా ఉపయోగపడొచ్చు

E-పేపర్

కర్కటేశ్వర స్వామి గుండాల కోనను దర్శించుకున్న టిడిపి మండలాధ్యక్షుడు కొమ్మా శివ

మూడవ(3) కార్తిక సోమవారం సందర్భంగా చిట్వేలు మండలంలోని పెద్దూరు గ్రామం నందు గల కర్కటేశ్వర స్వామి గుండాల కోనను దర్శించుకోవడం జరిగింది.

అల్లూరి సీతారామరాజు

అరకు: చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపిన సోమ కుటుంబ

2018 సెప్టెంబర్ లో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సురేష్ కుమార్ ను కారుణ్య నియామకంలో డీటీ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి నేతృత్వంలో సోమ భార్య ఇచ్ఛావతి, తనయులు, కుటుంబ సభ్యులు విజయవాడ లో సిఎం చంద్రబాబు ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు అండగా ఉన్న సిఎం చంద్రబాబుకి, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మాజీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యుడు సివేరి అబ్రహాం అన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారని అబ్రహాం పేర్కొన్నారు. గత తప్పిదాలు మరల తలెత్తకుండా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు అబ్రహాం పేర్కొన్నారు.

E-పేపర్

మారో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వధ విహారి ట్రావెల్స్ Atleast ఒకసారి గా మంటలు చెలరేగాయి.29 మంది సభ్యుల బస్సులో ఎమర్జెన్సీ అద్దాలు పగలకొట్టుకొని బయటకి వచ్చాడు తరువాత బస్సు పూర్తి గా కలిపోయింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నేటి నుంచి ‘స్వామిత్వ’ ప్రత్యేక గ్రామసభలు

గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ముందు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నారు. స్వామిత్వ పథకంలో రెండో విడత కింద 45 లక్షల ఆస్తులకు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు వీటిని అందించే ముందు మరోసారి గ్రామసభలు నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ నెల 22 వరకు గ్రామసభలు నిర్వహించనున్నాయి. డ్రోన్ సర్వే తర్వాత గ్రామకంఠాల్లో ఆస్తులకు సంబంధించిన కొలతలు నిర్ధారించుకునేందుకు 2,300 గ్రామాల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేశారు. గ్రామసభల్లో ప్రజల నుంచి వీటిపై అభ్యంతరాలు స్వీకరించాకే ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఇటీవల జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మూడో దశ కార్యక్రమం కూడా ప్రారంభించి మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి కార్డులు పంపిణీ చేయాలని ఆయన నిర్దేశించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోల్డ్ రిఫ్ ఘటనలపై కేంద్రం అల్టిమేటం – జనవరి 1 నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు తప్పనిసరి

కోల్డ్‌ రిఫ్‌ దగ్గు మందుతో పలు రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి 1 నాటికి అన్ని ఔషధ తయారీదారులు అంతర్జాతీయ ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ (CDSCO) కొత్త ఆదేశాలు విడుదల చేసింది. ఉత్పత్తుల నాణ్యత, భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కంపెనీలకు సూచించింది. ప్రమాణాలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.

అమరావతి

మీడియా రిలేషన్స్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి • 2026-2027 రెండేళ్ళ కాలానికి అక్రిడిటేషన్లు జారీ

మీడియా రిలేషన్స్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి • 2026-2027 రెండేళ్ళ కాలానికి అక్రిడిటేషన్లు జారీ • మీడియా సంస్థల నుండి ధరఖాస్తులు ఆహ్వానం అమరావతి,10 నవంబరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు 2026-2027 రెండేళ్ళ కాలపరిమతితో కూడిన అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు సంబంధించి మీడియా రిలేషన్స్ పోర్టల్(వైబ్ సైట్)ను సోమవారం సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి లాంచనంగా ప్రారంభించారు. ఈమేరకు ఎపి సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో మీడియా రిలేషన్స్ వెబ్ సైట్ ను సమాచారశాఖ సంచాలకులు కెఎస్.విశ్వనాధన్ తోకలిసి ప్రారంభించారు.గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపధ్యంలో రానున్న 2026-2027 రెండేళ్ల కాలానికి నూతన అక్రిడిటేషన్లు జారీకి వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతోంది.రాష్ట్ర మరియు జిల్లాస్థాయి అక్రిడిటేషన్లకై అర్హులైన మీడియా ప్రతినిధులు అందరూ ఈపోర్టల్ లో ధరఖాస్తు చేసుకోవచ్చును.ఈపోర్టల్ లో ధరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లు తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉందో కూడా ఈవైబ్ సైట్ ద్వారా తెల్సుకోవచ్చును.ఈపోర్టల్ లో ఏవిధంగా ధరఖాస్తు చేసుకోవాలనే విధి విధానాలను మంగళవారం ప్రత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది. (జారీ చేసిన వారు:డైరెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)

తెలంగాణ

జిల్లాస్థాయి రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించిన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత, జిల్లా సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు భద్రతను, ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రత్యేకించి పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్లు, సూచించిన ప్రదేశాలలో ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, అలాగే ఇతర శాఖలు, పూర్తి సహకారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన వివిధ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేయడం జరుగుతుందని, అలాగే చిట్యాల అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల,నాలుగైదు రోజులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందని, దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కలెక్టర్ ను కోరారు.

అన్నమయ్య

రోడ్డు మీద ఇసుకతో ప్రజలకు ఇబ్బంది

నందలూరు పట్టణంలో రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో తాజ్ జిమ్ సెంటర్ ఎదురుగా ఇసుక పేరుకుపోవడం స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది ఇసుక వలన పాదచారులు,వాహనదారులు జారిపడి గాయపడే ప్రమాదం ఉంది అని స్థానిక ప్రజలు అభిప్రాయము వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఈ రోడ్డుపై వందలాది వాహనాలు వెళ్తాయి,కానీ ఎవరు ఈ ఇసుకను తొలగించే ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీ అధికారులు ఈ విషయంపై స్పందించి రోడ్డును శుభ్రం చేయాలి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.