విశాఖపట్నం
*29వ వార్డులో జగనన్న జన్మదిన వేడుకలు* *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* * మహిళలకు చీరలు పంపిణీ * *వార్డు అధ్యక్షుడు పీతల వాసు &రాష్ట్ర యువజన కార్యదర్శి కనకల ఈశ్వర్ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్* *ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి*.. జనహృదయనేత జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు 29వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు పీతల వాసు & రాష్ట్ర యువజన కార్యదర్శి కనకల ఈశ్వర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ తో కలిసి ముందుగా కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు అభిమానులు మధ్య జననేతకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా నరనరాల్లో అభిమానాన్ని నింపుకున్నారని అన్నారు. పీతల వాసు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు దక్షిణ నియోజకవర్గంలో ముందస్తుగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు దక్షిణ నియోజకవర్గంలో అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ సంబరాలు వాడ వాడల ఘనంగా నిర్వహించనున్నట్లు వాసుపల్లి తెలిపారు. ఇప్పటికే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొన్ననున్నదని చెప్పారు. ఆయన జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని వాసుపల్లి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెవర మహేష్ సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్, గుమ్మడి చంద్రమౌళి, జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీ, అరుగుల రాజ్ కుమార్, RTI జిల్లా సెక్రటరీ, అడప శివ, తమ్మినేని శ్రీను,సిటీ యూత్ సెక్రటరీ, ఎలమంచిలి సంతోష్, సిటీ యూత్ సెక్రటరీ, 29వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిటీ మహిళా జనరల్ సెక్రటరీ, బొండాడ వెంకటరావు, బీసీ సెల్ ప్రెసిడెంట్, కొయ్య చిన్ని, ఉరికిరి శివ పండు, ఇల్లిపిల్లి శ్రీనివాస్, సారిపల్లి రమనేశ్వరరావు, నీలాపు లక్ష్మి, లంకె మహేశ్వరి, మేడిశెట్టి రూప, బోర వెంకటలక్ష్మి, ఫైబోటి శివ, సతీష్, పడాల సూర్య, కోట ఆనంద ప్రసాద్, బొడ్డు ధనరాజ్, సారిపిల్లి శివ, వడ్డాది శివ, చందక భాస్కరరావు, కరీం, గండివలస పెంటయ్య, పీతల వినయ్, గొల్ల గాని మధు, ఆబోతుల వెంకటరమణ, మేడపాటి సుబ్బారెడ్డి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 29వ వార్డు నాయకులు చంద్రమౌళి, అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.