ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) జిల్లా శాఖ సహకారంతో, మహిళా ఉద్యోగుల స్వచ్చంద భాగస్వామ్యంతో మహిళావిభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నగరంలోని APSRTC వద్ద గల శ్రీ ఏనుగు సుందరరామిరెడ్డి కల్యాణమండపం నందు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి శ్రీమతి డాక్టర్ వి.సుజాత, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీమతి డి.తులసి, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి లు హాజరై మహిళా ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేశారు. తదుపరి అతిథులను మహిళావిభాగం మెమెంటో లు మరియు దుశ్శాలువాలతో ఆత్మీయంగా సత్కరించింది. అలాగే కుటుంబ భారాలు, ఉద్యోగ ఒత్తిడులు మరచి ఉద్యోగినులు ఆటపాటల్లో సేదదీరారు. ఆపై ఆటపాటల విజేతలకు బహుమతిప్రధానం జరిగింది. అనంతరం ఈ వేడుకల నిర్వహణలో విశేష కృషి చేసినవారికి గౌరవ జ్ఞాపికలతో సత్కరించారు.వేడుకలకు హాజరైన ప్రతి ఉద్యోగినికి చక్కని స్నాక్స్, రుచికరమైన భోజనాలతో పాటు APGEA మహిళావిభాగం ఆత్మీయకానుకలు ఇవ్వడం విశేషం. APGEA మహిళావిభాగం చైర్ పర్సన్ శ్రీమతి సుజాతా బాయి మరియు కన్వీనర్ సువర్ణ కుమారిల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో అన్ని శాఖల మరియు అన్ని స్థాయిల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) జిల్లా శాఖ సహకారంతో, మహిళా ఉద్యోగుల స్వచ్చంద భాగస్వామ్యంతో మహిళావిభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నగరంలోని APSRTC వద్ద గల శ్రీ ఏనుగు సుందరరామిరెడ్డి కల్యాణమండపం నందు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి శ్రీమతి డాక్టర్ వి.సుజాత, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీమతి డి.తులసి, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి లు హాజరై మహిళా ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేశారు. తదుపరి అతిథులను మహిళావిభాగం మెమెంటో లు మరియు దుశ్శాలువాలతో ఆత్మీయంగా సత్కరించింది. అలాగే కుటుంబ భారాలు, ఉద్యోగ ఒత్తిడులు మరచి ఉద్యోగినులు ఆటపాటల్లో సేదదీరారు. ఆపై ఆటపాటల విజేతలకు బహుమతిప్రధానం జరిగింది. అనంతరం ఈ వేడుకల నిర్వహణలో విశేష కృషి చేసినవారికి గౌరవ జ్ఞాపికలతో సత్కరించారు.వేడుకలకు హాజరైన ప్రతి ఉద్యోగినికి చక్కని స్నాక్స్, రుచికరమైన భోజనాలతో పాటు APGEA మహిళావిభాగం ఆత్మీయకానుకలు ఇవ్వడం విశేషం. APGEA మహిళావిభాగం చైర్ పర్సన్ శ్రీమతి సుజాతా బాయి మరియు కన్వీనర్ సువర్ణ కుమారిల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో అన్ని శాఖల మరియు అన్ని స్థాయిల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

