_పొదలకూరు లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు_
పొదలకూరు పున్నమి ప్రతినిధి : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పట్టణంలోని ఆర్& బీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.నివాళి అర్పించిన వారిలో పొదలకూరు సి.ఐ శివరామ కృష్ణా రెడ్డి , పీఏసీఎస్ అధ్యక్షులు, మండల టీడీపీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు ,టౌన్ అధ్యక్షులు బొద్దులూరు మల్లిఖార్జున నాయుడు , నెల్లూరు రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమర్తలూరు చెంచయ్య ,ఏఎంసీ డైరెక్టర్ పిన్నెల ప్రభాకర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుఱ్ఱం మీరామధు, ఆకులూరు విజయ్ కుమార్, పొట్టి సుధాకర్, మణిస్వామి, సురేష్ బాబు, సురేష్ కుమార్, కృష్ణం రమణయ్య, డా.బ్రహ్మయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు నడవాలన్నారు. శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చన్నారు. పొదలకూరులో తొలిసారిగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని , ఆయన జయంతిని నిర్వహించడం ఆనందంగా ఉందని వారు వెల్లడించారు. అనంతరం బిస్కట్ ప్యాకెట్స్ పంచి పెట్టారు.


