నరసన్నపేట ,సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
భీమవరంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పిన్నింటిపేట గ్రామానికి చెందిన సిహెచ్. మహేష్ ఉత్తమ ప్రతిభ కనబరచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ ఆర్. రవిచంద్రన్ చేతుల మీదుగా సోమవారం డిగ్రీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు సిహెచ్. వల్లభరావు, రాజేశ్వరి మాట్లాడుతూ మహేష్ చిన్ననాటి నుంచే కష్టపడే తత్వమున్నవాడని, చదువులో ఎల్లప్పుడూ ముందుండేవాడని గుర్తుచేశారు. కంప్యూటర్ సైన్స్లో ప్రతిభ కనబరచి కళాశాలకు, కుటుంబానికి మంచి పేరు తెచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. ఇష్టపడి కష్టపడితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఆయన విజయం నిరూపిస్తోందని పేర్కొన్నారు


