గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డ్ పరిధిలో APEPDCL ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ పనులను రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం (జగన్) గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు విజయరామరాజు, రాజన్ రాజు, పావాడా రమణమూర్తి, కాండ్రేగుల శ్రీనివాసనాయుడు, డీవీ సూరిబాబు, బొడ్డా సన్యాసి, గండేపల్లి రాము, కోరుకొండ కళ్యాణ్చక్రవర్తి, సుందర్ సునీల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


