28న దక్షణ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
* ప్రజా ఉద్యమంతో దూసుకెళ్తాం!
* సంతకాల సేకరణలో ప్రజల నుండి విశేష స్పందన..
* మకొద్దీ… ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
* పోస్టర్ ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్నీ నిరసిస్తూ జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతంగా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆశీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులను ఉద్దేశించి వాసుపల్లి మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన దక్షణ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. అశేష జన సమీకరణతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. ప్రజల ద్వారా కోటి సంతకాల సేకరణలో విశేష స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని వైయస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు.
చంద్రబాబు అరాచక అబద్దాల పాలనను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని అన్నారు. అలాగే వైయస్సార్సీపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి వివరించాలని సూచించారు. డాక్టర్లు కావాలన్నా విద్యార్థుల కలను, పేదలకు మెరుగైన వైద్యం లభించాలని జగన్మోహన్ రెడ్డి ఆనాడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు వేశారన్నారు. దీనికి భిన్నంగా చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారనీ మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు మార్చుకొని ప్రజలకు అవసరమైన వసతుల కల్పనలో అవినీతి రహితంగా ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు, దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


