
భీమవరం : ఆపదలో ఉన్నవారికి అభయ హస్తంలా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.
బుధవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ 20 విడతలో 20 మంది లబ్ధిదారులకు రూ 21,31,462 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు.
ఇప్పటికి వరకు భీమవరం నియోజకవర్గంలో 321 మందికి రూ 2,90,48,358 లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామన్నారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.


