కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణకై కార్మిక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాడుదాం.
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసేవరకు , వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసి గ్రేడ్.2 కార్మికులకు న్యాయం చేసేవరకు ,పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించే వరకు పోరాటాలు కొనసాగించాలని, కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని, నగదురహిత అపరిమిత మెడికల్ పాలసీని వర్తింపజేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలని,నేరుగా వేతనాలు చెల్లించడం వల్ల విద్యుత్ సంస్థకు 192 కోట్ల భారం తగ్గుతుందని, తద్వారా వేతనాలలో వ్యత్యాసాన్ని నివారించవచ్చని, అరియర్స్ చెల్లించవచ్చని, పీసిరేట్ వర్కర్లైన, ఎస్ పి ఎం స్టోర్స్ హమాలీలకు, మీటర్ రీడర్ లకు, పిసీఎలకు, ఎటిఎం, లాంటి అనేకమందికి ఉద్యోగ భద్రత కనీస వేతనం చెల్లించవచ్చని , అర్హత కలిగిన ఉద్యోగులకు, జేఈ, జేఏ, కన్వర్షన్ ఇవ్వాలని ఒకవైపు ధరలు పెరుగుతున్న పెండింగ్ 4డిఏ లు విడుదల చేయకపోవడం అన్యాయమని, విద్యుత్ యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు శాంతియుత వాతావరణంలో పరిష్కరించాలని లేని ఎడల సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని , దానికి పూర్తిగా యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలిపారు, కార్మిక వర్గ శ్రేయస్సు, సమస్యల పరిష్కారమయ్యే వరకు, ప్రైవేటీకరణ విధానాలనుండి సంస్థను రక్షించుకోవాలని , విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే బిల్లుకు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక ఉద్యోగులకు అందరికీ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి k కిరణ్ రాష్ట్ర నాయకులు v సుబ్రమ ణ్యం, c నారాయణ, బాలకృష్ణ,రమేష్, సురేష్, శివ, బాషా, నాగరాజా R ఈశ్వర్ రావు, s సుధాకర్, జయకృష్ణ,అంకయ్య, చిన్నయ్య,తదితరులు పాల్గొన్నారు.

