కామారెడ్డి, 26 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల పరిధిలో హిందీ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ల సముదాయ సమావేశం జరిగింది.ఈ కార్యక్ర మంలో మండల విద్యాధికారి ఆనంద్రావు మాట్లా డుతూ ఎస్ఎస్సి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు దశలవారీ ప్రణాళికతో సిద్ధం చేయాలని ఉపాధ్యా యులకు సూచించారు. రామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలోని విద్యా విభాగంలో కీలక మండలంగా గుర్తింపు పొందింది.వచ్చే నెలలోనే సిలబస్ పూర్తిచేసి, ఆపై రివిజన్ తరగతులకు ప్రా ధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు.విద్యార్థు ల్లో ఆత్మవిశ్వాసం పెంచే పరీక్షా శిక్షణ, ప్రాక్టీస్ టెస్ట్లు నిర్వహించాలని సూచించారు. సమావే శంలో జడ్పీహెచ్ఎస్ పోసానిపేట్ హిందీ ఉపాధ్యా యులు డా. షకీల్ పిహెచ్డీ పూర్తిచేసిన సందర్భం గా, ఎంఇఓ ఆనంద్రావు ప్రత్యేకంగా సన్మానించా రు. రామారెడ్డి, పాల్వంచ, మాచారెడ్డి ప్రాంతాల ఉన్నత పాఠశాలల హిందీ ఉపాధ్యాయులు, సీఆ ర్పీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


