సిద్దిపేట హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య లతో కలిసి నిర్వహించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అధికారులందరితో కలిసి కొత్త బట్టల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
అర్ అండ్ బి శాఖ హుస్నాబాద్ నుండి కొత్తపల్లి నాలుగు వరసల రోడ్ నిర్మాణ పనుల్లో 90 శాతం చెట్లు తొలగింపు పూర్తి, ఎలక్ట్రిక్ లైన్ తొలగించడం అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలగించాలని ఆదేశించారు. కోహెడ నుండి సముద్రాల రోడ్ బి టి రోడ్ పనులు 15 రోజులు పూర్తి చెయ్యాలి. హుస్నాబాద్ నుండి రామవరం రోడ్ అక్కన్న పెట నుండి కొత్తకొండ రోడ్ పనులు మరియు ఇతర భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చెయ్యాలని అర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
పంచాయతీ రాజ్ ఇంజనీర్ శాఖలో ఏం జీ ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద నిర్మాణం చేపడుతున్న గ్రామపంచాయతీ భవనాలు హుస్నాబాద్ మండలం లో కూచనపల్లి, మడత అక్కన్న పెట మండలంలో గొల్లపల్లి, గౌరవెల్లి, చౌటపల్లి, గుబ్బాలి, కట్కూరు, రేగొండ, శ్రీరామ్ తండా, పంతులు తండా, కుందన్వానీ పల్లి, రామవరం, మల్చెరువు తండా కోహెడ మండలంలో ధర్మారం, వరికోలు, నకిరేకొమ్ముల, పరివేద, నారాయణపూర్ గ్రామాల్లో గ్రామపంచాయతీ భవన పనులు జరుగుతున్నట్లు డిసెంబర్ చివరకల్ల నిర్మాణం పూర్తి చెయ్యాలి. గాంధీ నగర్, పొట్లపల్లి, బల్లునాయక్ తండా, మహమ్మదాపూర్, మీర్జాపూర్, బంజేరుపల్లి, చౌటాకుంట తండా, పెద్ద తండా, దుబ్బ తండాబత్తుని వాణి పల్లి భూమి కొరత భూమి కొరత భూమి కొరత ఉందని గ్రామాల్లో పాత జీ పి భవనం వేరొక స్థలం గూర్చి ఇంజనీర్ గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. అంగన్వాడి భవనాలు, కాంపౌండ్ వాల్ లు జనవరి లోపు పూర్తి అయ్యేలా పని చెయ్యాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్ డి ఎఫ్ కింద చేపట్టిన పనులు, పి ఎచ్ సి, సబ్సంటర్ భవన నిర్మాణాలు మరియు పి ఎచ్ సి, సబ్సంటర్ మేజర్ మైనర్ రిపేర్లు పనులను యుద్ధప్రాతిపదకన పూర్తి చెయ్యాలి.
మున్సిపల్ లో జంక్షన్ డెవలప్మెంట్, ఎల్లమ్మచెరువు వెళ్ళేందుకు రోడ్ నిర్మాణం మరియు సుందరీకరణ పనులు ఇతరత్ర పనులు నిర్ణిత కాలం లో పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యుత్ ఉపకేంద్ర పనులు పురోగతిలో ఉన్నవి పూర్తి చెయ్యాలని పూర్తి అయిన వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ మండలాల్లో తాగు నీరు అందించే పనులు సైతం చేపట్టిన పనులు పూర్తి చెయ్యాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
ఆయిల్ ఫామ్ సాగులో వేగం పెంచాలని వరి కోతలు పూర్తి అవుతున్నాయి కావున ఇప్పుడే మంచి సమయం రైతులను కలిసి ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహించాలని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.


