శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలంలో వచ్చే శుక్రవారం జరిగే “పోలిపాడ్యమి” ఉత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం అధికారులు పుష్కరిణి పరిసరాల్లో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్నారు.
పోలిపాడ్యమి సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు, పిల్లలు, గ్రామస్తులు వరాహ పుష్కరిణి వద్ద దీపప్రదానం చేసే సంప్రదాయం ఉండడంతో, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కార్యనిర్వాహణాధికారి తెలిపారు.
భద్రతా ఏర్పాట్లు ఇలా…
పుష్కరిణి చెరువు లోపల, చెరువు గట్టుపై విస్తృతంగా బారికేడింగ్ ఏర్పాటు
పుష్కరిణి వద్ద, దారి మధ్య మార్గాల్లో దేవస్థానం కమ్యూనిటీ గార్డులు & పోలీసులు బందోబస్తు
20 నవంబర్ గురువారం రాత్రి నుండి ప్రత్యేకంగా దేవస్థానం సిబ్బందికి డ్యూటీలు
పుష్కరిణికి వెళ్లే మార్గాల్లో వాహన రద్దీ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు నియమించాలని కోరింపు
అధికారులు మాట్లాడుతూ, “భక్తులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు భద్రతా నిబంధనలు పాటిస్తూ వరాహ పుష్కరిణి వద్ద దీపాలను వదలవలసినదిగా” విజ్ఞప్తి చేశారు.
అలాగే ఈ వివరాలన్ని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులకు చేరేలా ప్రచారం చేయాలని తెలిపారు.


