Tuesday, 10 March 2026
  • Home  
  • సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులర్పించిన తెదేపా నాయకులు
- తిరుపతి

సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులర్పించిన తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని పూసల వీధి కూడలి వద్ద సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సహధర్మచారిణి క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ…. మహిళా హక్కుల సాధనకు విద్యే సరైన ఆయుధమని, అణచివేతకు గురైన మహిళా శక్తిని ఆధునిక విద్య ద్వారానే విముక్తి చేయాలని సామాజిక ఉద్యమం చేసిన సావిత్రిబాయి పూలే ఒక సామాజిక విప్లవ జ్యోతి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. జి. దశరథాచా,వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. మహిళలను సామాజిక రుగ్మతల నుండి విముక్తి చేయడం, లింగ వివక్షను ఎదుర్కొనేలా చైతన్య పరచడం, పితృస్వామ్య వ్యవస్థ నిర్మూలన చేసి మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా సావిత్రిబాయి పూలే 1852లో సేవా మండల్ అనే సంస్థను స్థాపించి మహిళా హక్కుల కోసం పోరాటం సాగించారని అగ్రవర్ణ దురహంకారపు కులవ్యవస్థ కారణంగా అన్యాయానికి గురైన బాలికల పరిస్థితిని మార్చేందుకు పూలే దంపతులు ‘సత్యశోధక్ సమాజ్’ను ప్రారంభించి బాల్య వివాహాల నిర్మూలన, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు వితంతువుల పునర్వివాహాలకు బలమైన సామాజిక ఉద్యమాన్ని నడిపారన్నారు. మహారాష్ట్రలో కరువు, ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాపించిన సమయంలో ప్రజలకు అండగా నిలిచి విరాళాలు సేకరించి వైద్య శిబిరాలు నిర్వహించారని, ప్లేగు బారిన పడిన వేలాది చిన్నారులకు సేవలందించిన పూలే దంపతులు నిజమైన సామాజిక సేవకులని కొనియాడారు. ప్లేగు వ్యాధి బాధితులకు సేవలందిస్తూ అదే వ్యాధి బారిన పడి సావిత్రిబాయి పూలే మరణించడం అత్యంత విచారకరమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యుడు ఎం. సుబ్బయ్య, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, టీఎన్‌టీయూసీ తిరుపతి పార్లమెంటు నాయకులు వెంకటరమణ, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, సయ్యద్ చాంద్ బాషా, గాజుల భగత్, సోంపల్లి మురళీ నాయుడు, హరి, సయ్యద్ అహ్మద్, సులేమాన్, మహమ్మద్ రఫీ, ఆనంద్, నూర్ మొహమ్మద్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని పూసల వీధి కూడలి వద్ద సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సహధర్మచారిణి క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ…. మహిళా హక్కుల సాధనకు విద్యే సరైన ఆయుధమని, అణచివేతకు గురైన మహిళా శక్తిని ఆధునిక విద్య ద్వారానే విముక్తి చేయాలని సామాజిక ఉద్యమం చేసిన సావిత్రిబాయి పూలే ఒక సామాజిక విప్లవ జ్యోతి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. జి. దశరథాచా,వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. మహిళలను సామాజిక రుగ్మతల నుండి విముక్తి చేయడం, లింగ వివక్షను ఎదుర్కొనేలా చైతన్య పరచడం, పితృస్వామ్య వ్యవస్థ నిర్మూలన చేసి మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా సావిత్రిబాయి పూలే 1852లో సేవా మండల్ అనే సంస్థను స్థాపించి మహిళా హక్కుల కోసం పోరాటం సాగించారని అగ్రవర్ణ దురహంకారపు కులవ్యవస్థ కారణంగా అన్యాయానికి గురైన బాలికల పరిస్థితిని మార్చేందుకు పూలే దంపతులు ‘సత్యశోధక్ సమాజ్’ను ప్రారంభించి బాల్య వివాహాల నిర్మూలన, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు వితంతువుల పునర్వివాహాలకు బలమైన సామాజిక ఉద్యమాన్ని నడిపారన్నారు. మహారాష్ట్రలో కరువు, ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాపించిన సమయంలో ప్రజలకు అండగా నిలిచి విరాళాలు సేకరించి వైద్య శిబిరాలు నిర్వహించారని, ప్లేగు బారిన పడిన వేలాది చిన్నారులకు సేవలందించిన పూలే దంపతులు నిజమైన సామాజిక సేవకులని కొనియాడారు. ప్లేగు వ్యాధి బాధితులకు సేవలందిస్తూ అదే వ్యాధి బారిన పడి సావిత్రిబాయి పూలే మరణించడం అత్యంత విచారకరమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యుడు ఎం. సుబ్బయ్య, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, టీఎన్‌టీయూసీ తిరుపతి పార్లమెంటు నాయకులు వెంకటరమణ, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, సయ్యద్ చాంద్ బాషా, గాజుల భగత్, సోంపల్లి మురళీ నాయుడు, హరి, సయ్యద్ అహ్మద్, సులేమాన్, మహమ్మద్ రఫీ, ఆనంద్, నూర్ మొహమ్మద్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.